US: వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు రద్దు!
ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో వీసా దరఖాస్తుదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసేతర హెచ్1బి, హెచ్3, ఎల్, ఓ, పీ, క్యూ తదితర కేటగిరీల్లో వీసాలు పొందాలనుకునే...
హెచ్1బీ, హెచ్3...తదితరులకు వర్తింపు
2022 ఏడాదికి వర్తించేలా అమెరికా నిర్ణయం
వాషింగ్టన్: ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో వీసా దరఖాస్తుదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసేతర హెచ్1బి, హెచ్3, ఎల్, ఓ, పీ, క్యూ తదితర కేటగిరీల్లో వీసాలు పొందాలనుకునే వారికి తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపునివ్వనుంది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించనుంది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వృత్తినిపుణులు, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, వీసా దరఖాస్తుదారుల్లో ఎవరిని ఇంటర్వ్యూకు పిలవాలో వద్దో నిర్ణయించే తుది అధికారాన్ని తాత్కాలికంగా కాన్సులర్ అధికారులకు ఇస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ గురువారం వెల్లడించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కేసుల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించాలని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. అందువల్ల అదనపు, తాజా వివరాల కోసం దరఖాస్తుదారులు సంబంధిత రాయబార, కాన్సులేట్ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించింది. అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతేనే వీసా మంజూరవుతుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 2022లో ఇంటర్వ్యూ విధానాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖాముఖిలు అవసరంలేని వీసా కేటగిరీలు..
* ప్రత్యేక వృత్తినిపుణులు(హెచ్-1బి)
* శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు(హెచ్3)
* ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేవారు(ఎల్)
* విశేష ప్రతిభావంతులు (ఓ)
* క్రీడాకారులు, కళాకారులు, వినోదరంగం వారు(పి)
* అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు(క్యు)
* ఇప్పటికే ఒకసారి వీసా పొంది దాని కాలపరిమితి ముగిసే 48 నెలల్లోగా పునరుద్ధరించుకోవాలని భావించే వారూ వ్యక్తిగత ఇంటర్వ్యూల హాజరీ నుంచి మినహాయింపునకు అర్హులుగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
* వీసా మినహాయింపు ప్రోగ్రామ్లోని సభ్య దేశాల పౌరులు ఇప్పుడు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ రద్దు చేసే విచక్షణాధికారం కాన్సులేట్ అధికారులకు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు