హాంకాంగ్లో ఘనంగా శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలు
మూడు సంవత్సరాల అనంతరం హాంకాంగ్లోని ఇండియా క్లబ్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల తర్వాత హాంకాంగ్లోని ఇండియా క్లబ్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. హాంకాంగ్లోని భారత ప్రభుత్వ దౌత్యాధికారిణి రెజీనా వర్గీస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భాషకు, సంస్కృతికి గుర్తింపునిచ్చే ఉగాది పండుగను అంతా ఒక చోట చేరి ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలు మరెన్నో చేయాల్సిన అవసరం ఉందన్నారు. భావితరానికి వారసత్వంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ మహిళా విభాగం ‘సఖియా’ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. సంజయ్ వాడపల్లి నృత్య ప్రదర్శన, శాంకరి బెల్లంకొండ కూచిపూడి నాట్య ప్రదర్శన వీక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో ‘యమగోల’, ‘డోంట్ స్టాప్ లాఫింగ్ ఫ్రెండ్స్ లొల్లి లోడింగ్’ నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. పాటలు, నృత్యాలతో సమాఖ్య సభ్యులందరూ కలిసి ఒక కుటుంబంలా పండుగ వేడుకగా నిర్వహించుకున్నారు. సాంస్కృతిక వేదిక రథ సారథులుగా వినూత్న, నీలిమ, గోపి వ్యవహరించారు. శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలకు విశేష అతిథులుగా చిన్మయ మిషన్ హాంకాంగ్ స్వామి సుప్రియానంద విచ్చేసి శుభకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. స్థానిక అధికారులు మిస్ ఏవా చొయ్, మిస్టర్ హుంగ్ కా వాయి, మిస్ మిటజీ లీయోంగ్, ఇండియా క్లబ్ అధ్యక్షుడు శ్రీ నాను లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియా, శుభోదయం గ్రూప్, ఇండియా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా గత ఏడాది ఆన్లైన్లో ఘంటసాల స్వరరాగ మహాయాగం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గాయని గాయకులు హర్షిణి పచ్చంటి, గాయత్రి, ఈరంకి శ్రీహరి బాలాదిత్య, కోట్ల సత్యనారాయణ, ఫణి కుమార్ కొత్తూరు, జైరాం పరమేశ్వరన్ను ప్రత్యేకంగా సత్కరించారు.
తెలుగు భాష, సంస్కృతి ఉన్నతికి చేస్తున్న కృషిని కొనియాడుతూ ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి రెజీనా వర్గీస్, సుజాత గోవాడ, అరుణ పాముల సత్కరించారు. సమాఖ్య నిర్వహించిన క్రీడా పోటీల విజేతలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సత్కరించారు. ప్రధాన కార్యవర్గ సభ్యులైన రాజశేఖర్ మన్నే, రమాదేవి సారంగా, మాధురి కొండ, హరీన్ తుమ్మలను అభినందించి సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి సారంగ రమాదేవి వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు