జ్ఞాన సమృద్ధం.. మృదుస్వభావ భరితం.. ఇది నవ భారత్: శ్రీశ్రీ రవిశంకర్
భారతదేశపు శక్తిసామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ప్రస్తుతం భారత్ కేవలం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మాత్రమే కాదని, సాంస్కృతిక వైవిధ్యాలకు పట్టుగొమ్మగా, వివిధ మత ధర్మాల ఆత్మీయ సమ్మేళనంగా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మనల్ని తీసుకొనిపోయే భూమిగా విరాజిల్లుతోందని శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ తన సందేశాన్ని వినిపించారు. భారతదేశపు శక్తిసామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం భారత్ కేవలం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మాత్రమే కాదని, సాంస్కృతిక వైవిధ్యాలకు పట్టుగొమ్మగా, వివిధ మత ధర్మాల ఆత్మీయ సమ్మేళనంగా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మనల్ని తీసుకొనిపోయే భూమిగా విరాజిల్లుతోందన్నారు. పలు అంశాలపై శ్రీశ్రీ రవిశంకర్ తన వాణిని వినిపించారు.
‘‘దేశంలో అభివృద్ధి చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే మనం సరైన దిశలోనే వెళ్తున్నామని గుర్తించాలి. ముందు తరాల భవిష్యత్తు ఈ దేశంలో మరింత ఉజ్వలంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. భారతదేశం ఎల్లప్పుడూ చిత్తశుద్ధికి, న్యాయానికి కట్టుబడే ఉందనే విషయాన్ని ప్రపంచం ఇప్పుడిప్పుడే గమనించడం ప్రారంభించింది. మనం జ్ఞానం కలిగినవారం. అదిలించో, బెదిరించో మనల్ని ఎవరూ లొంగదీసుకోలేరు. అదే సమయంలో మనం ప్రపంచంలోని ప్రజలందరి మనోభావాలు, బాధల విషయంలో చాలా సున్నితంగా స్పందిస్తాం. ప్రపంచశాంతి నెలకొల్పడంలో భారతదేశం పోషించగలిగే పాత్రను ప్రపంచం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.
అంతటి వైవిధ్యాన్ని మనం స్వీకరించి పోషిస్తున్నాము. భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల సమాహారం. అన్ని సంప్రదాయాలను, మతాలను మనం గౌరవిస్తాము. అన్ని మతాలూ ఈ దేశంలో స్థానం పొందాయి. అన్ని మతాలు ఇక్కడ గౌరవం పొందతున్నాయి. మనదేశంలో ఒక ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య దేశాల్లో చాలా చోట్ల రెండు, మూడు పెద్ద పార్టీలే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా మనది. ప్రస్తుత కాలం మన చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని నాకు అనిపిస్తుంది. మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాము. భారతదేశ వైభవాన్ని, మన సంస్కృతిని, నాగరికతను గుర్తించాం. ఇది మన యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రోజున వారు మన చరిత్ర, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇదంతా మన మృదువైన శక్తి.
కొన్నేళ్ల క్రితం అమెరికాలో జరిగిన ఇంటర్వ్యూ.. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం కాకుండా నియంతృత్వం ఉండి ఉంటే ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి చెంది ఉండేదా?’ అని అడిగారు. నెమ్మదిగా ఎదిగినా ప్రజాస్వామ్యాన్నే ఇష్టపడతామని స్పష్టం చేశాము. ప్రజాస్వామ్యంలో ప్రతీ గొంతునూ వింటాం. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. సమగ్రాభివృద్ధికి అందరి గొంతులూ వినిపించాలి. బలమైన గొంతుకలు వినిపించాలి. తెలివైన గొంతుకలు వినిపించాలి.
కుటుంబంలో ప్రతి సభ్యునికీ తమ లక్ష్యం గురించి పూర్తి అవగాహన ఉండి, అవసరమైనప్పుడు వ్యతిరేకించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆ కుటుంబం సామరస్యంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే, అవసరమైనప్పుడు సహకరిస్తారు. మొత్తం మీద, ప్రతి ఒక్కరూ అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. శాంతియుతమైన, సంతోషకరమైన కుటుంబంగా ముందుకు సాగుతారు. మన భారతదేశం సరిగ్గా ఇదే విధంగా ఉంది. ప్రతిపక్షాల గొంతు చాలా ముఖ్యం. ఏ ప్రజాస్వామ్యానికైనా అది తప్పనిసరి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. ప్రతిపక్షాలు, తాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనినీ వ్యతిరేకించడం కాకుండా, ప్రభుత్వంలోని లోపాలను తప్పక ఎత్తి చూపాలి. ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ కలసి మెలసి సంబరాలు చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సమాజంలోని వివిధ వర్గాల మధ్య సహకారమే దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా పరుగెత్తేలా చేస్తుంది.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వారు తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలి. ఇది మీ పవిత్ర కర్తవ్యం. ఓటు వేసేటప్పుడు, మీ కులం, వర్గం, మతం లాంటివి చూడకుండా, మంచివారికి, సమాజానికి మేలు చేయగలిగే వ్యక్తికి ఓటు వేయండి. అభ్యర్థులు మీ నుంచి ఓటు అడగడానికి వచ్చినప్పుడు దేవతలవలే ప్రవర్తించండి. అలాగే అని, వారి మాటలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పండి. వారు డబ్బు ఇవ్వజూపితే, మీ ఓట్లను కొన్ని కరెన్సీ నోట్లకు అమ్ముకోకండి. అది మీ ఆత్మను అమ్ముకున్నట్లే. ‘ఓటు వేసేందుకు డబ్బు తీసుకోను’ అనేది మీ విధానం కావాలి. మన ప్రజలు చాలా తెలివి గలవారు. భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఉత్సాహభరితమై, సజీవంగా ప్రాణశక్తితో విరాజిల్లుతున్న ప్రజాస్వామ్యం. దానిని నిలబెట్టుకోవడం మన సమష్టి బాధ్యత’’ అని గురుదేవ్ శ్రీశ్రీ రవి శంకర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు