ప్రధాని ప్రసంగంపై శివసేన విసుర్లు
రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా వ్యంగ్యంగా స్పందించింది.
సామ్నాలో వ్యంగ్యంగా స్పందించిన శివసేన
దిల్లీ: రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా వ్యంగ్యంగా స్పందించింది. గత ఏడెనిమిది నెలల్లో ఆయన చేసిన ప్రసంగాల్లో ఇదే గొప్పదంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ఒక బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా మాట్లాడారని, అది ఆధ్యాత్మికంగా ఉందని రాసుకొచ్చింది.
‘కరోనా గురించి మోదీ చేసిన ఏడెనిమిది నిమిషాల ప్రసంగం గత ఏడెనిమిది నెలల్లోనే గొప్పది. ఆయన ఒక బాధ్యతాయుతమైన రక్షకుడిగా కనిపించారు. ఆయన వచ్చారు, మాట్లాడారు. ఆయన మోము వెలిగిపోయింది. ఆ వెలుగు మనం ఎదుర్కొనే చీకట్లను తరిమి కొడుతుంది’ అంటూ శివసేన తన సంపాదకీయంలో వ్యంగ్యంగా రాసుకొచ్చింది. అలాగే ఆయన నిరుద్యోగ సమస్యపై మాట్లాడకపోవడాన్ని విమర్శిస్తూ..‘ప్రధాని దేశ ఆర్థిక టర్నోవర్ పెరుగుతోందన్నారు. కానీ, కరోనా వైరస్ విజృంభణ తరవాత దేశాన్ని పీడిస్తోన్న నిరుద్యోగాన్ని ఎలా నియంత్రిస్తారనే దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. దానిపై ఆయన ప్రకటన చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, ఆయన తప్పించుకున్నారు. మోదీ తన ప్రసంగంలో ఏమి ఇచ్చారు? దాంట్లో కొత్తేముంది? వరదలతో ప్రభావితమైన మహారాష్ట్రకు ఏదైనా ఆర్థిక సహాయం చేశారా? ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ..ఆయన ప్రసంగం ప్రభావవంతంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ మంగళవారం చేసిన ప్రసంగంలో ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. వ్యాధిని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించడంతో పాటు..వ్యాక్సిన్ చివరి వ్యక్తికి చేరే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?