Election Results 2022: పంజాబ్లో ‘సామాన్యుడి’ ప్రభంజనం.. ఎన్ని ఓట్లొచ్చాయో తెలుసా?
పంజాబ్లో ఓ ప్రభంజనం.. రెండోసారి ‘సామాన్యుడి’ గురి తప్పలేదు. అధికార కాంగ్రెస్ను మట్టికరిపించి.. ఇతర రాజకీయ పక్షాల ఎత్తుల్ని చిత్తుచేసిన .....
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లో ఓ ప్రభంజనం.. రెండోసారి ‘సామాన్యుడి’ గురి తప్పలేదు. అధికార కాంగ్రెస్ను మట్టికరిపించి.. ఇతర రాజకీయ పక్షాల ఎత్తుల్ని చిత్తుచేసిన ‘ఆప్’ పంజాబ్లో పెను సంచలనం సృష్టించింది. పంజాబ్లో 2017లో నిరాశ ఎదురైనా.. ఏమాత్రం వెనకడుగు వేయక ఇటీవల చండీగఢ్ మున్సి‘పోల్స్’ ఫలితాలను టానిక్లా మలుచుకొని ఎన్నికల యుద్ధరంగంలోకి దూకిన ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబీలు జేజేలు పలికారు. దిల్లీ తరహా పాలన అందిస్తామన్న కేజ్రీవాల్ పరివారం చెప్పిన మాటలను విశ్వసించిన జనం.. భారీగా ఓట్లు, సీట్లు కట్టబెట్టి రికార్డు స్థాయి విజయం అందించారు.
ఓట్లు.. సీట్లు ఇలా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో కేవలం 20 స్థానాల నుంచి భారీగా పుంజుకొంది. రాష్ట్రంలో మొత్తంగా 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో విజయ ఢంకా మోగించి ప్రత్యర్థుల్ని చిత్తుచేసింది. ఇకపోతే, అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం కాగా.. శిరోమణి అకాలీదళ్ 3, భాజపా 2, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోచోట విజయం సాధించారు. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలంతా వెలవెలబోయారు. ఈ ఎన్నికల్లో ఆప్కు 65,38,783 ఓట్లు (42శాతానికి పైగా) రాగా.. కాంగ్రెస్కు 35,76,684 ఓట్లు (22.98శాతం) మాత్రమే వచ్చాయి. ఇకపోతే శిరోమణి అకాలీదళ్కు 28,61,286 ఓట్లు (18.4శాతం) రాగా.. భాజపాకు 10,27,143 ఓట్లు (6.60శాతం), బీఎస్పీకి 2,75,232 ఓట్లు (1.8శాతం), ఇతరులు 11,44,686 ఓట్లు (7.35శాతం) ఓట్లు రాగా.. నోటాకు 1,10,308 ఓట్లు (0.7శాతం) వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు