Purandeswari: తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారు: పురందేశ్వరి
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు. బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. దిల్లీ మద్యం స్కామ్లో శరత్చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎంసీఐ స్కామ్లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని భాజపా ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.
కళంకితులకు పదవులా?: లంకా దినకర్
తితిదే పాలకమండలి సభ్యుల నియామకాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తిరుమల శ్రీవారి సేవ కన్నా.. తన సొంతవారి సేవ ప్రాధాన్యం అయిందని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడం రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యకృత్యం అయిందని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో నిందితుడు శరత్ చంద్రారెడ్డికి, అనేక మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులకు పదవులను కట్టబెట్టారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.