INDIA bloc: ఎన్నికల సమయంలో.. ఇండియా కూటమిలో విభేదాలను తోసిపుచ్చలేం: శరద్ పవార్
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేమని, అయితే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు.
ముంబయి: మరికొన్ని నెలల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)లోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వివాదంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు లేవని చెప్పారు.
‘మరికొన్ని నెలల్లో నాలుగైదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు మాకెంతో ముఖ్యం. ఇటువంటి తరుణంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేం. అయితే, కూటమి నుంచి పలువురు తటస్థ నేతలను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి ఎలా తీసుకురావాలో కూటమి చూస్తుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులతో చర్చిస్తా. సంబంధిత రాష్ట్రాల్లో కూటమి పక్షాల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మరో ఎనిమిది, పది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని శరద్ పవార్ అన్నారు.
కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్ స్పష్టత
ఛత్తీస్గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఓ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడం.. అధికార ఆప్, కాంగ్రెస్ల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగమే. అయితే, కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే శరద్ పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.