JDS-NDA: ఎన్డీయేలోకి చేరికపై విభేదాలు.. జేడీఎస్లో చీలిక?
JDS- NDA: ఎన్డీయేలో చేరే విషయంలో జేడీఎస్లో విభేదాలు తలెత్తాయి. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీ చీలిక సైతం తలెత్తే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
JDS-NDA | బెంగళూరు: రాబోయే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపాతో కలిసి వెళ్లాలన్న నిర్ణయంపై జనతాదళ్ సెక్యులర్లో (JDS) విభేదాలు తలెత్తాయి. ఎన్డీయేలో (NDA) చేరాలన్న పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సి.ఎం. ఇబ్రహీం (C M Ibrahim) తప్పుబట్టారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయేలో చేరబోదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను నిర్ణయం తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. పార్టీలో చీలిక ఉంటుందని బహిరంగంగానే సంకేతాలు ఇచ్చారు.
కేంద్రమంత్రి అమిత్షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సెప్టెంబర్ 22న దిల్లీలో భేటీ అనంతరం ఎన్డీయేలో చేరుతున్నట్లు దేవేగౌడ తనయుడు, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం సోమవారం మీడియాతో మాట్లాడారు. భాజపాతో పొత్తు వార్త బయటకు రాగానే.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన పార్టీ నేతలు పార్టీని వీడారని గుర్తుచేశారు. భాజపాతో కలిసి వెళ్లేందుకు అంగీకరించొద్దని దేవేగౌడను కోరతానని చెప్పారు.
మేనిఫెస్టో బాగుంది.. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: అసదుద్దీన్
సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దేవేగౌడకు తెలియజేసేందుకు ఓ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒకవేళ దేవేగౌడ, కుమార స్వామి అందుకు అంగీకరించకపోతే పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మాదే అసలైన సెక్యులర్. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో పార్టీ గురించి నిర్ణయం తీసకునే హక్కు నాకు ఉంది. దేవేగౌడ, కుమారస్వామిని అడుగుతాం. ఒకవేళ అంగీకరించకపోతే.. వారు వెళ్తే అడ్డుకోం. పార్టీ ఎమ్మెల్యేల సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తాం’’ అని ఇబ్రహీం అన్నారు. తనతో కొందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారి పేర్లను బహిరంగపర్చాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. ఇబ్రహీం వ్యాఖ్యాలపై కుమారస్వామి మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని, ఆయన నిర్ణయం ఆయనదేనని సమాధానం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్