Guntur: జగన్ దోపిడీ కోసమే.. ఏపీ ఇసుక విధానం: ఎంపీ బాలశౌరి
జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు.
గుంటూరు: జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై స్పందించారు.
‘‘ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉంది. తరచుగా ఇసుక పాలసీని మార్చి, కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశారు. జేపీ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. బంగారం ధర తగ్గుతుందేమో కానీ, ఇసుక ధర మాత్రం తగ్గడం లేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరగుతున్నాయి. పేదలకు పెత్తందారులకు పోరాటం అని చెప్పే జగన్.. రీచ్లపై ఆధారపడిన పేదల ఆదాయానికి గండి కొట్టారు. కార్పొరేట్ సంస్థ ద్వారా రూ.వందల కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు.
తమిళనాడులో మాదిరి తనిఖీలు చేయాలి..
రాష్ట్రంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తమిళనాడులో అక్రమ తవ్వకాలపై ఈడీ తనిఖీలు చేసి ఐదుగురు కలెక్టర్లపై కేసులు పెట్టింది. అత్యాధునిక సాంకేతికత వినియోగించి అక్కడ తనిఖీలు నిర్వహించారు. మన వద్ద ఎంత తవ్వినా, ఎలా తవ్వినా ఏం కాదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో మన రాష్ట్రంలో కనీసం పది మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు. తమిళనాడు తరహాలో ఏపీలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేయాలి. నా ఎస్సీ, నా బీసీ అనే జగన్.. ఇసుక ఆదాయంలో వారికి వాటా ఎందుకు ఇవ్వడం లేదు? ఇసుక స్కామ్ చాలా పెద్ద కుంభకోణం. ఈడీ తనిఖీలు చేస్తే సూత్రధారులు ఎవరో బయటకు వస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని బాలశౌరి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
నోటా.. వచ్చిందిలా
-
రైలు తలుపు.. మృత్యు పిలుపు
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు