Ayyanna Patrudu: నర్సీపట్నంలో ఉద్రిక్తత.. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి
అంతే సంఖ్యలో తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో అయ్యన్న ఇంటి గోడను ఆదివారం వేకువజామున మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేశారంటూ అయ్యన్న కుటుంబసభ్యులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గోడ కూల్చివేతకు వచ్చిన జేసీబీ టైర్లలో గాలిని అయ్యన్న అనుచరులు తీసేశారు. ఇప్పటికే వంద మందికి పైగా పోలీసులు అక్కడ ఉండగా.. మరో 3 బెటాలియన్లను అదనంగా తీసుకొచ్చి మోహరించారు. అంతే సంఖ్యలో అభిమానులు, తెదేపా కార్యకర్తలు అక్కడికి వచ్చి అయ్యన్న కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అక్కడే టెంట్ వేసి మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరి పట్ల నిరసన తెలుపుతున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అయ్యన్న ఇంటి వద్దకు వచ్చి కూల్చివేసిన గోడను పరిశీలించారు. మరోవైపు అయ్యన్న ఇంటికి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయన నివాసానికి వెళ్లే 2 మార్గాలను పోలీసులు మూసివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.