ఇబ్బంది పెట్టినా ప్రజల నుంచి వేరుచేయలేరు.. సమయం వచ్చినపుడు అన్నీ చెప్తా: పొంగులేటి
ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.
మణుగూరు: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. తాను ఉగ్రవాదిని కాదని.. దందాలేమీ చేయలేదని వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తన అభిమానులు, అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి మాట్లాడారు.
‘‘నమ్ముకున్న వారి కోసమే నా జీవితం. భద్రతా సిబ్బందిని తొలగించినా ఏమీ బాధపడలేదు. ఇప్పుడున్న ఇద్దరిని తీసేసినా ఏమీ కాదు. నేను రాజకీయాల్లోకి రాకముందే నేను కాంట్రాక్టర్ను. కేసీఆర్ పిలుపు మేరకు భారాసలో చేరా. గడిచిన నాలుగేళ్లలో పార్టీలో ఏం గౌరవం పొందామో మీకూ తెలుసు. ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. లక్షల మంది అభిమానించే సైనికులు, అభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల్ని కలుస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదు. నన్ను ఇబ్బంది పెట్టినా.. ప్రజల నుంచి వేరుచేయలేరు. సమయం, సందర్భం వచ్చినపుడు అన్ని విషయాలు చెప్తా’’ అని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.