Politics news: రాజకీయాల్లో ‘ధోనీ’ ఆయన..! రాజ్నాథ్ సింగ్
మధ్యప్రదేశ్లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్.. స్థానిక భాజపా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రాజకీయాల్లో ధోనీగా అభివర్ణించారు.
భోపాల్: ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఒకటి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే భాజపా (BJP) సీనియర్ నేత, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) సోమవారం ఇక్కడి నీమచ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)ను రాజకీయాల్లో ‘ధోనీ’ (Dhoni of Politics)గా అభివర్ణించారు.
16మందితో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఉత్తమ్కు చోటు
‘శివరాజ్ సింగ్ను రాజకీయాల్లో ‘ధోనీ’గా అభివర్ణిస్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. గత 30ఏళ్లుగా చౌహాన్ నాకు తెలుసు. ఆట ఆరంభం ఎలా ఉన్నా.. మంచి ఫినిషింగ్ ఇచ్చి గెలవడం ఆయనకు తెలుసు. ఇది ఆయనకు ఉన్న కళ. కానీ, కేవలం దానిపైనే ఆధారపడి ఆయన రాజకీయంగా విజయం సాధించలేదు. సేవకుడిలా ప్రజలకు అండగా నిలిచారు. ప్రజల విశ్వాసాన్ని పొందారు’ అని రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్పై విరుచుకుపడుతూ.. కాంగ్రెస్ నేత కమల్నాథ్ తన ఏడాదిన్నర పాలనలో కేంద్ర పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!