Politics news: రాజకీయాల్లో ‘ధోనీ’ ఆయన..! రాజ్‌నాథ్‌ సింగ్‌

మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. స్థానిక భాజపా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను రాజకీయాల్లో ధోనీగా అభివర్ణించారు.

Published : 04 Sep 2023 20:51 IST

భోపాల్: ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఒకటి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే భాజపా (BJP) సీనియర్‌ నేత, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) సోమవారం ఇక్కడి నీమచ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan)ను రాజకీయాల్లో ‘ధోనీ’ (Dhoni of Politics)గా అభివర్ణించారు.

16మందితో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఉత్తమ్‌కు చోటు

‘శివరాజ్‌ సింగ్‌ను రాజకీయాల్లో ‘ధోనీ’గా అభివర్ణిస్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. గత 30ఏళ్లుగా చౌహాన్‌ నాకు తెలుసు. ఆట ఆరంభం ఎలా ఉన్నా.. మంచి ఫినిషింగ్ ఇచ్చి గెలవడం ఆయనకు తెలుసు. ఇది ఆయనకు ఉన్న కళ. కానీ, కేవలం దానిపైనే ఆధారపడి ఆయన రాజకీయంగా విజయం సాధించలేదు. సేవకుడిలా ప్రజలకు అండగా నిలిచారు. ప్రజల విశ్వాసాన్ని పొందారు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ.. కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ తన ఏడాదిన్నర పాలనలో కేంద్ర పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని