Chandrababu: తెలంగాణలో తెదేపా మళ్లీ బలపడుతోంది: చంద్రబాబు

తెలంగాణలో తెదేపా మళ్లీ బలపడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 

Published : 29 Jul 2022 02:24 IST

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తెదేపా మళ్లీ బలపడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన  పర్యటించారు. బూర్గంపహాడ్‌ మండలంలోని వరద బాధితుల్ని పరామర్శించారు. వరదల్లో చనిపోయిన నర్సయ్య కుటుంబానికి రూ.లక్ష అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతోందన్నారు. తెదేపా అవిర్భావమే తెలంగాణలో జరిగిందన్నారు. యువత భవిష్యత్‌ కోసం తెలంగాణలోనూ తెదేపా ఉండాలన్నారు. ఖమ్మంతో తెదేపాకు విడదీయరాని బంధం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని పేర్కొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని