KBC: నా హాకీ ప్యాడ్స్ కోసం ఆవును అమ్మేశారు: హాకీ గోల్కీపర్ శ్రీజేష్
ప్రతిష్ఠాత్మక క్విజ్షో, అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి’ సీజన్-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శిరీష్ పాల్గొన్నారు. సాధారణ క్విజ్షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమనగానే.. హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ భావోద్వేగానికి లోనై.. ‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్కి ఎంపికైనప్పుడు..
ముంబయి: ప్రతిష్టాత్మక క్విజ్షో, అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి’ సీజన్-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శిరీష్ పాల్గొన్నారు. సాధారణ క్విజ్షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమన్నారు. దీనికి హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ భావోద్వేగానికిలోనై తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.
‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్కి ఎంపికైనప్పుడు.. ‘నువ్వు క్రీడలవైపు వెళ్లాలనుకుంటున్నావ్? నీకు అక్కడ స్థిరమైన ఉద్యోగం దొరుకుతుందా?’ అని నాన్న ప్రశ్నించారు. ‘నేనేంటో నిరూపించుకోవడానికి మూడేళ్ల సమయం ఇవ్వండి నాన్న. ఈలోపు నేను కనుక ఫెయిల్ అయితే మళ్లీ నా రూట్ మార్చుకుంటా’ అని మాటిచ్చా. ఆ ఒప్పందంతో నేను హాకీ ఆడటం మొదలుపెట్టా. అలా గోల్కీపర్గా రంగప్రవేశం చేశా.
గోల్కీపింగ్ గురించి మీకో విషయం చెప్పాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత వెచ్చించే డబ్బు మా దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే మాదో సాధారణ రైతు కుటుంబం. హాకీ పాడ్స్ కొనేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఓ రోజు మా నాన్నను ప్యాడ్స్ కోసం డబ్బులు కావాలని అడిగా. ఆయన శక్తి మేరకు ఎలాగైనా పంపించేలా ప్రయత్నం చేశారు. అలా ఆయన అన్నట్టే ప్యాడ్స్ కొనిచ్చారు. నాన్న ఎలా కొనిచ్చారని అమ్మను అడగగానే కేవలం నా పాడ్స్ కోసమని నాన్న మా కుటుంబానికి జీవనాధారణమైన ఆవును అమ్మేశారని తెలిసింది’’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
‘‘నేను ఎప్పుడైనా నిరుత్సాహానికి గురైనప్పుడు లేదా ఈ క్రీడలెందుకు వదిలేద్దామా అని ఆలోచనవచ్చినప్పుడు ఆరోజు మా నాన్న నాకోసం చేసిన త్యాగాన్ని గుర్తుతెచ్చుకుంటా. తన బిడ్డ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడని ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే జీవనాధారమైన ఆవుని అమ్మేసి నాకోసం చేసిన రిస్క్ని గుర్తుచేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేష్.. కాంస్యం పతకాన్ని తన తండ్రికి అంకితమించినట్లు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య