ధోనీకి అదే కరెక్ట్.. హస్సీ ఏమన్నాడు?
టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆడుతుంటే ఆ ధైర్యమే వేరు. అతడు భారత జట్టులో కొనసాగుతున్నా, ఐపీఎల్లో సీఎస్కేకు ఆడుతున్నా...
అయితే, మధ్యలో ఆటగాళ్లు సహకరించాలి..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆడుతుంటే ఆ ధైర్యమే వేరు. అతడు భారత జట్టులో కొనసాగుతున్నా, ఐపీఎల్లో సీఎస్కేకు ఆడుతున్నా.. తన వికెట్ పడేదాకా ప్రత్యర్థి జట్టును ఓటమి భయం వెంటాతుంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అతడు మిడిల్ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ క్లిష్ట సమయాల్లోనూ గొప్పగా పోరాడి అద్భుత విజయాలు అందించాడు. అలాంటి బ్యాట్స్మన్.. మరీ ఐదు, ఆరు స్థానాల్లో కాకుండా నాలుగో స్థానంలో ఆడాలని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. అతడికి ఆ స్థానమే సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన హస్సీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ధోనీ బ్యాటింగ్ చేయడానికి నాలుగో స్థానమే సరిపోతుంది. కానీ, మిడిల్ ఆర్డర్లోని ప్రతీ ఒక్కరూ పరిస్థితులకు తగ్గట్టు అలవాటు చేసుకోవాలి. ఈ ప్రయోగం ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు ప్రిపరేషన్ మీదే ధ్యాస పెట్టాలి’ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో అదృష్టవంతమైన జట్టని, తమకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. అనంతరం ఐపీఎల్కు సన్నద్ధమయ్యే విషయంపై స్పందిస్తూ.. చెన్నై ఆటగాళ్ల ఎలా సన్నద్ధమవ్వాలి, అక్కడ ఎలా ఆడాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పాడు. ఇదిలా ఉండగా, వచ్చేనెల 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహించనున్న తెలిసిందే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు నేటి నుంచి చెపాక్ స్టేడియంలో ప్రత్యేక ఫిట్నెస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇది 20న ముగుస్తుండగా, 21న అక్కడి నుంచే ఆ జట్టు మొత్తం దుబాయ్కి బయలుదేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ