కథ మారేందుకు ఒక్క సిక్సర్ చాలని తెలుసు
ఒక్క సిక్సర్తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్ సూపర్ హిట్టర్ రాహుల్ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు....
రాజస్థాన్ గెలుపు వీరుడు రాహుల్ తెవాతియా
షార్జా: ఒక్క సిక్సర్తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్ సూపర్ హిట్టర్ రాహుల్ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.
షార్జా వేదికగా జరిగిన మ్యాచులో మొదట పంజాబ్ 223/2 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్ (69; 54 బంతుల్లో 7×4, 1×6), పూరన్ (25*; 8 బంతుల్లో 1×4, 3×6) అద్భుతంగా ఆడారు. ఛేదనలో సంజు శాంసన్ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7×4 2×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పంజాబ్కు చుక్కలు చూపించాడు. తొలుత 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతడు కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి రాజస్థాన్ గెలుపు బాటలు వేశాడు. చివరి 12 బంతుల్లోనే 45 పరుగులు సాధించి విమర్శకుల నోటికి తాళం వేశాడు.
‘నేను బంతిని దూరంగా కొట్టగలనని డగౌట్లోని వారికి తెలుసు. నన్ను నేను నమ్మాలని భావించా. ఒక్క సిక్సర్ కొడితే అంతా మారిపోతుంది. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం మాత్రం అద్భుతమే. నిజానికి లెగ్స్పిన్లో షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. కానీ కుదర్లేదు. అందుకే మిగతా బౌలర్ల బౌలింగ్లో దంచేశా. ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నాను. మొదట 20 బంతుల్లో ఆడినట్టు ఎప్పుడూ ఆడలేదు. ఆ తర్వాత బాదడం షురూ చేశాను’ అని తెవాతియా చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276