
దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్కే: రహానె
ఇంటర్నెట్డెస్క్: అడిలైడ్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన అనంతరం తనకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి కాల్ వచ్చిందని వైస్కెప్టెన్ అజింక్య రహానె తెలిపాడు. కాల్లో దాదా స్ఫూర్తినిస్తూ మాట్లాడాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో చివరి మూడు టెస్టులకు రహానె సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
‘‘అడిలైడ్ టెస్టు ముగిసిన అనంతరం దాదా నాకు కాల్ చేశాడు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాడు. వ్యక్తిగా, జట్టుగా నమ్ముతూ పోరాడాలని సూచించాడు’’ అని రహానె తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. అయితే కోహ్లీ గైర్హాజరీతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా యువ ఆటగాళ్ల అద్భుత పోరాటంతో సిరీస్ను భారత్ 2-1తో సాధించింది.
కాగా, యువఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడంలో ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, ఐపీఎల్ పాత్ర ఎంతో ఉందని రహానె అన్నాడు. భయంలేని క్రికెట్ ఆడటానికి ఐపీఎల్ దోహదపడిందని చెప్పాడు. అలాగే యువ ఆటగాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిద్దడంలో ద్రవిడ్ ప్రధానపాత్ర పోషించాడని కొనియాడాడు. భారత్-ఎ, అండర్-19 జట్లకు ద్రవిడ్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి రహానె మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం. దేశం కోసం పోరాడాలనే ఆలోచిస్తాం. మీ అందరికీ ఓ విషయం చెబుతున్నా.. కోహ్లీ కెప్టెన్, నేను వైస్కెప్టెన్. కోహ్లీ వెళ్లేముందు ఏం జరిగిందో అనవసరం. అతడు మా సారథి. ఇంగ్లాండ్ సిరీస్లో బ్యాట్స్మన్గా నా పాత్రను ఆస్వాదిస్తా’’ అని అన్నాడు. సిడ్నీ టెస్టులో సిరాజ్, బుమ్రా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవడాన్ని రహానె తీవ్రంగా ఖండించాడు. ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసేవారిని స్టేడియం నుంచి బయటకు పంపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించాడు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ
-
Sports News
Wimbledon 2022: స్టార్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. టోర్నీ నుంచి ఔట్..
-
India News
Agnipath: అగ్నిపథ్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: పంజాబ్ సీఎం
-
Politics News
Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
-
Movies News
Milind Soman: స్ఫూర్తినింపేలా యోగా వీడియో.. సతీమణిపై మిలింద్ సోమన్ కామెంట్!
-
World News
Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Ire vs Ind: దీపక్ ధనాధన్ సెంచరీ.. ఐర్లాండ్ ముందు కొండంత లక్ష్యం
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్కు తిరిగిరావాలి: మాధవన్
- GST: జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వీటికి మినహాయింపు లేనట్లే!
- Social Look: రామ్చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!