ఇంటర్వ్యూయర్గా మారిన యాష్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని పోరాటం చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆతిథ్య జట్టుకు దీటుగా బదులిస్తోంది. సీనియర్ బౌలర్లు గాయపడటంతో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచే అయినా అదరగొడుతున్నారు.....
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని పోరాటం చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆతిథ్య జట్టుకు దీటుగా బదులిస్తోంది. సీనియర్ బౌలర్లు గాయపడటంతో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచే అయినా అదరగొడుతున్నారు. ముఖ్యంగా అశ్విన్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సుందర్ అర్ధశతకం చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అతడికి తోడుగా ఠాకూర్ సైతం అర్ధశతకంతో అలరించాడు. దాంతో శతక భాగస్వామ్యం నెలకొల్పిన యాష్ స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు.
సాధారణంగా ఆట ముగిశాక ఆటగాళ్లు మీడియాతో మాట్లాడుతుంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్ అయితే ఎక్కువగా యుజువేంద్ర చాహల్ క్రికెటర్లతో మాట్లాడిస్తుంటాడు. ఆసీస్తో నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిశాక అశ్విన్ మైక్ అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ మనసులోని భావాలను బయటకు రప్పించాడు.
‘తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశావు. టెస్టు కెరీర్ ఆరంభంలోనే స్టీవ్స్మిత్ వికెట్ పడగొట్టావు. బ్యాటుతో అర్ధశతకం సాధించావు. టెస్టు క్రికెట్ సులభంగా ఉందనుకుంటా’ అని సుందర్ను యాష్ ప్రశ్నించాడు. భాగస్వామ్యం నెలకొల్పేటప్పుడు సుందర్, శార్దూల్ మనస్తత్వం ఎలా ఉందో అడిగాడు.
‘గొప్పగా అనిపించింది. ఆ సమయంలో సిక్సర్లు కొట్టాలన్న ఉద్దేశమేమీ లేదు. బంతిని చూసి షాట్లు బాదాను. బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది’ అని శార్దూల్ బదులిచ్చాడు. ‘టెస్టు క్రికెట్ కచ్చితంగా కఠినమైన ఫార్మాటే. నేను బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. కెరీర్లో శుభారంభం లభించడం అదృష్టం. దేవుడి దయ, కుటుంబం అండతోనే ఇది సాధ్యమైంది’ అని సుందర్ అన్నాడు.
ఇవీ చదవండి
ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..