WTC Final: అప్పుడు ఆసీస్ చేసిన పొరపాటే.. ఇప్పుడు భారత్ చేసింది: స్టీవ్ వా
రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ (WTC Final) ఆడుతున్న భారత్కు మళ్లీ కలిసిరావడం లేదు. జట్టు ఎంపిక నుంచి ఆటగాళ్ల ఆటతీరు వరకు అన్నింటా విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ పట్టుబిగిస్తోంది. ప్రస్తుతం 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 123/4 స్కోరుతో కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు మొదటి సెషన్ మినహా ఆసీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో 2019 యాషెస్ సిరీస్లో తమ జట్టు చేసిన పొరపాటును ఇప్పుడు టీమ్ఇండియా చేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. ఓవల్ వేదికగానే జరిగిన ఆ మ్యాచ్లో అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడని.. అయితే, చివరికి ఇంగ్లాండ్ 145 పరుగుల తేడాతో ఆసీస్పై విజయం సాధించిందని గుర్తు చేశాడు. అలాగే భారత తుది జట్టు ఎంపికా సరిగా లేదని స్టీవ్ వా పేర్కొన్నాడు.
‘‘నాలుగేళ్ల కిందట యాషెస్ సిరీస్లో మేం చేసిన మిస్టేక్ను ఈసారి భారత్ చేసింది. ఓవల్ పిచ్ ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటుంది. పిచ్ పైభాగంలో పచ్చిక ఉన్నట్లు అనిపించినా.. కిందిభాగంలో మాత్రం పొడిగానే ఉంటుంది. దీంతో పచ్చని పిచ్తో బరిలోకి దిగుతున్నామనే భ్రమతో ఉంటారు. ఎండ వచ్చేస్తే పరిస్థితి త్వరగా మారిపోతుంది. మరింతగా పొడిబారడంతో బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే, టీమ్ఇండియా తుది జట్టును కూడా సరైంది ఎంచుకోలేదనిపించింది. పచ్చికను చూసి పేసర్లను తీసుకుంది. కానీ, స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.
నేను తప్పకుండా అశ్విన్ను ఎంపిక చేసేవాడిని. కేవలం అతడు బౌలింగ్కు మాత్రమే కాకుండా బ్యాటింగ్కూ పనికొస్తాడు. ఇప్పటికే టెస్టుల్లో ఐదు సెంచరీలు చేసిన అతడు తుది జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. డబ్ల్యూటీసీ 2021- 23 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ కూడా అతడే’’ అని స్టీవ్ వ్యాఖ్యానించాడు.
సరైన సన్నద్ధత లేదు: రికీ పాంటింగ్
ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆటతీరు నిరాశ కలిగించిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. మరీ ముఖ్యంగా పేసర్లకు సరైన సన్నద్ధత లేదని పేర్కొన్నాడు.‘‘ఇప్పటి వరకు భారత్ ఆటతీరు సరిగా లేదు. ఐపీఎల్ తర్వాత అతిపెద్ద పోరుకు వచ్చిన బౌలర్లకు సరైన సన్నద్ధత లేదు. ఆసీస్ ఆటగాళ్లు కొందరు చాలా రోజుల ముందే ఇంగ్లాండ్కు వచ్చారు. అయితే, కొందరు మాత్రం గత మూడు నెలల నుంచి ఏమీ చేయకుండానే బరిలోకి దిగారు. ఇక భారత బ్యాటర్లు ఏమాత్రం ప్రిపేర్ అయ్యారో తెలియదు. విరాట్ను అడిగితే మంచి ఫామ్లో ఉన్నట్లు చెబుతాడు. అలాగే, రహానె కూడా తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఐపీఎల్ లేకపోతే రహానెను ఈ మ్యాచ్కు ఎంపిక చేసేవారే కాదు. అందుకే, ఐపీఎల్ వల్ల లాభనష్టాలు ఉంటాయి’’ అని పాంటింగ్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్