Sunil Gavaskar: మన దేశం అసలు పేరు ‘భారత్’.. ఇది వినడానికి బాగుంది: సునీల్ గావస్కర్
కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కూడా ‘భారత్’ (Bharat) అంశంపై స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘భారత్’ (Bharat) అంశంపైనే చర్చ నడుస్తోంది. కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ అంశంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదు: వీరేందర్ సెహ్వాగ్
త్వరలో భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్లో మన ఆటగాళ్లు టీమ్ఇండియాకు బదులు ‘టీమ్భారత్’ జెర్సీలతో బరిలోకి దిగాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. చాలా దేశాలు తిరిగి తమ అసలు పేరుకు మారాయని పేర్కొన్నాడు. తాజాగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కూడా ‘భారత్’ (Bharat) అంశంపై స్పందించారు. మన దేశం అసలు పేరు భారత్ అని, ఇది వినడానికి కూడా బాగుందని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
‘‘మన దేశం అసలు పేరు ‘భారత్’. ఇది వినడానికి కూడా బాగుంది. కానీ, దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్ టీమ్’ అని పిలవాలి. ఇది వరకు కూడా దేశాల పేర్లలో మార్పులు జరిగాయి. బర్మాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నారు. కాబట్టి మన దేశం కూడా అసలు పేరుకు మారొచ్చు. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ, ఇది అన్నిస్థాయిల్లో మారాల్సి ఉంటుంది’’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.