కత్తిలా మెరిసింది
చరిత్రలో లేదా సినిమాల్లో కత్తి యుద్ధం గురించి చదవడం.. చూడటమే కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఒలింపిక్స్లోనూ ఈ క్రీడను చూస్తూనే ఉంటాం...
చరిత్రలో లేదా సినిమాల్లో కత్తి యుద్ధం గురించి చదవడం.. చూడటమే కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఒలింపిక్స్లోనూ ఈ క్రీడను చూస్తూనే ఉంటాం. రెండు ఊచల్లాంటి కత్తులు పట్టుకుని ఫెన్సర్లు పోరాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది.. శరీరానికి కత్తి తాకితే వారి శిరస్త్రాణం పైనున్న లైటు వెలగడం లాంటివి చాలా కొత్తగా అనిపిస్తాయి. ఐరోపా దేశాలు ఈ క్రీడలో ఆరితేరిపోయాయి. అలాంటిది మన దగ్గరా అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఫెన్సర్ ఉందని.. ఆమెను టోక్యోలో ఒలింపిక్స్ చూస్తామని ఎవరైనా ఊహించి ఉంటారా? ఒలింపిక్స్లో కత్తి తిప్పబోతున్న ఆ ఫెన్సరే భవానీ దేవి. మహిళల వ్యక్తిగత సెబర్ విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా నిలిచిన ఈ 27 ఏళ్ల తమిళనాడు అమ్మాయి.. ఈ అవకాశాన్ని అందుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసింది.
తొలి భారత ఫెన్సర్గా భవాని
చెన్నెలో పుట్టిన భవాని 2003లో క్రీడల్లో కెరీర్ ప్రారంభించింది. ధనుష్కొడి పాఠశాల్లో చదువుతున్న సమయంలోనే ఆమెకు ఫెన్సింగ్ పరిచయం అయింది. ఈ క్రమంలో కేరళ సాయ్ సెంటర్లో చోటు దక్కడం ఆమె కెరీర్లో మలుపు. 14 ఏళ్లకే తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడిన భవానీ.. 2009 కామన్వెల్త్ ఛాంపియన్షిప్ (మలేసియా), 2010లో ఆసియా ఛాంపియన్షిప్ (ఫిలిప్ఫీన్స్)లో కాంస్యం గెలవడం ద్వారా వెలుగులోకి వచ్చింది. 2015లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని గోస్పోర్ట్స్ స్పాన్సర్షిప్ దొరకడం ఆమె కెరీర్కు ఊతమిచ్చింది. 2019లో కాన్బెర్రాలో జరిగిన సీనియర్ కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి సీనియర్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారత ఫెన్సర్గా భవాని నిలిచింది. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే సత్తా తనకుందని చాటింది. అదే ఏడాది నాన్న మరణించడం ఆమెను మానసికంగా కుంగదీసినా.. ఒలింపిక్స్లో ఆడాలన్న ఆయన కల తీర్చడం కోసం ఈ క్రీడలో కొనసాగింది.
2012 నుంచి ప్రయత్నించి..
ఫెన్సింగ్లో ఎనిమిదిసార్లు జాతీయ ఛాంపియన్ అయిన భవానికి ఒలింపిక్స్లో ఆడాలనేది పెద్ద కల. 2012 నుంచి ఆమె ఈ ప్రయత్నంలోనే ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్తో పాటు 2016 రియో క్రీడల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. ఈసారి టోక్యోలో కూడా భవానీకి అవకాశం దక్కదేమో అనిపించింది. కరోనా మహమ్మారి కారణంగా 2019లో ఫెన్సింగ్ ఈవెంట్లన్నీ రద్దు కావడంతో ఈ తమిళనాడు ఫెన్సర్ ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఆమె మాత్రం తన ప్రాక్టీస్ను ఆపలేదు. ఇటలీ కోచ్ జొనాటి శిక్షణలో తప్పులు దిద్దుకుంటూ ముందుకు సాగింది. ఏకంగా అయిదేళ్లుగా ఇటలీలోనే ఉంటూ ఆమె సాధన కొనసాగించింది. హంగేరిలో కొవిడ్ నిబంధనలు కఠినంగా ఉండడంతో భవాని. రోడ్డు మార్గం ద్వారా 10 గంటలు ప్రయాణించి ప్రపంచకప్కు వచ్చింది. ర్యాంకింగ్లో 45 స్థానంలో నిలవడం ద్వారా ఆసియా ఓసియానియాలో అందుబాటులో ఉన్న రెండు ఒలింపిక్ బెర్తుల్లో ఒక దాన్ని సొంతం చేసుకుంది. ‘‘భారత్లో ఫెన్సింగ్ ప్రాచుర్యంలో లేదు. ఇలాంటి దేశం నుంచి వచ్చిన నేను టోక్యోలో భారత్కు ప్రతినిధిగా ఉండాలనుకున్నా. ఒలింపిక్స్ బెర్తు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించా. కుటుంబాన్ని విడిచి అయిదేళ్లు ఇటలీలోనే సాధన చేశా. హంగేరి టోర్నీ ద్వారా ఒలింపిక్స్కు వెళ్లకపోతే సియోల్లో జరిగే ఆఖరి అర్హత పోటీనే మిగిలేది. కానీ ర్యాంకింగ్ పాయింట్ల ద్వారా ఒలింపిక్ బెర్తు సొంతం చేసుకోవడంతో నా శ్రమకు ఫలితం దక్కింది’’ అని భవాని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్తో కోల్కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?