Team India: ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్ విఫలం.. చాట్జీపీటీ విశ్లేషణ ఇదే!
ఐసీసీ మెగా టోర్నీల్లో మరోసారి టీమ్ఇండియాకు (Team India) పరాభవం ఎదురైంది. 2013 నుంచి ఇప్పటి వరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయిది. ఈ క్రమంలో భారత్ ఎందుకు విఫలమవుతుందో 2021 ముందు వరకు ఉన్న పరిస్థితులను విశ్లేషించి చాట్జీపీటీ (ChatGPT) సమాధానం ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఖాతాలో (Team India) 2013 నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ (ICC) ట్రోఫీ లేదు. సెమీస్, ఫైనల్కు చేరినా కీలక సమయంలో చేతులెత్తేస్తూ ఓటమిబాట పట్టడం అలవాటుగా మారింది. తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ (WTC Final 2023) టీమ్ఇండియా ఓడిపోయింది. ఇలా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లలో భారత్ తడబాటుకు కారణమేంటి అని చాట్జీపీటీ (ChatGPT) అని అడగ్గా.. వివిధ కోణాల్లో విశ్లేషించింది. ఆ వివరాలు ఇవీ...
ప్రశ్న: ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ టీమ్ ఎందుకు ఇబ్బంది పడుతోంది...?
చాట్జీపీటీ (ChatGPT) సమాధానం: ఐసీసీ ఈవెంట్లలో భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే, ఐసీసీ టోర్నీల్లో విజయాలతోపాటు ఇబ్బందులు ఎదుర్కొంది. క్రికెట్ అంటేనే తీవ్రమైన పోటీ ఉంటుంది. చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. అందులో ఇవి కొన్ని..
- భారీ అంచనాలు.. ఒత్తిడి: ప్రతి మెగా టోర్నీ సందర్భంగా భారత జట్టుపై భారీ అంచనాలు.. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. క్రికెట్ పట్ల అంతులేని అభిమానం కారణంగా ఫ్యాన్స్, మీడియాలో అంచనాలు పెరిగిపోయాయి. ఇలా తీవ్ర ఒత్తిడితో మెగా టోర్నీల్లో భారత ప్రదర్శన నిలకడగా ఉండటం లేదు. దీంతో ఆటగాళ్ల ప్రదర్శన, మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది.
- సవాళ్లు విసిరే పరిస్థితులు: ఐసీసీ ఈవెంట్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. వాతావరణం, పిచ్ పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. భారత ఆటగాళ్లు వాటికి అలవాటు పడటం సవాల్తో కూడుకున్నదే. త్వరగా పరిస్థితులను అలవర్చుకుంటేనే రాణించేందుకు అవకాశం ఉంటుంది.
- అనుభవలేమి: భారీ టోర్నీల్లో ఆడేటప్పుడు జట్టు నిండా అనుభవం కలిగిన ఆటగాళ్లతో ఇతర టీమ్లు బరిలోకి దిగుతాయి. కానీ, భారత్ మాత్రం ఎక్కువగా కుర్రాళ్లు, పెద్దగా అనుభవం లేని వారితో ఆడుతోంది. అధిక ఒత్తిడి కలిగిన పరిస్థితుల్లో అనుభవలేమి ఉండటం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- వ్యూహాత్మక నిర్ణయాలు: జట్టు స్ట్రాటజీ, టీమ్ సెలెక్షన్, కోచింగ్ సిబ్బంది, మేనేజ్మెంట్ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఐసీసీ ఈవెంట్లలో భారత్ ప్రదర్శనపై ప్రభావం పడుతోంది. గొప్ప నిర్ణయాలు, ప్రణాళికలు లేకపోవడం కూడానూ భారత్కు వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ప్రధాన కారణం.
- ఆటగాళ్ల ఫామ్, గాయాలు: ఇతర జట్లలాగానే భారత్కూ గాయాల బెడద తప్పలేదు. అలాగే ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం కూడా టీమ్ విజయాలపై ప్రభావం చూపాయి. కీలకమైన ఆటగాళ్లు గాయపడటం, ఫామ్ను కోల్పోవడం వల్ల ఐసీసీ ఈవెంట్లలో భారత్ రాణించడంలో విఫలమవుతోంది.
- గట్టి పోటీ: ఐసీసీ ఈవెంట్లు అంటేనే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు తలపడతాయి. పోటీ విపరీతంగా ఉంటుంది. భారత్ కఠిన ప్రత్యర్థులను ఎదుర్కోవడం, అత్యున్నత స్థాయిలో పోటీ ఉండటం కూడా భారత్ ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. ఇలాంటి టోర్నీల్లో నిలకడైన ఆటతీరు చాలా ముఖ్యం.
- నోట్: కేవలం భారత్ జట్టుకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ పోటీల్లో ఆడే ప్రతి టీమ్కూ ఈ కారణాలు వర్తిస్తాయి. ప్రతి టోర్నీకి జట్ల ప్రదర్శన విభిన్నంగా ఉంటుంది. అందుకే ఐసీసీ ఈవెంట్లలో వారి విజయాలు, ఇబ్బందులపై ప్రభావం చూపే అంశాలు కలిసి ఉంటాయని చాట్ జీపీటీ చెబుతోంది.
గమనిక: తాజా అంశాలను, WTC ఫైనల్ను బేస్ చేసుకుని చాట్జీపీటీ సమాచారం ఇవ్వదు. 2021 కంటే ముందు ఉన్న పరిస్థితులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు