WI vs IND: విన్నింగ్ షాట్గా సిక్స్.. అయినా హార్దిక్పై ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఎందుకంటే?
ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గతంలో వ్యవహరించిన మాదిరిగానే హార్దిక్ పాండ్య (Hardik Pandya) కూడా ప్రవర్తించాడని అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ సందేహం..?
ఇంటర్నెట్ డెస్క్: కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మరోసారి ట్రోలింగ్కు గురికాక తప్పలేదు. వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్లో (WI vs IND) సిక్స్తో మ్యాచ్ను ముగించాడు. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) అదరగొట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ (83) దూకుడుతోపాటు తిలక్ వర్మ (49*) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ విజయం నల్లేరుమీద నడకలా సాగింది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్య (20*) సిక్స్తో మ్యాచ్ను గెలిపించాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ను భారత్ 17.5 ఓవర్లలోనే ఛేదించి గెలిచింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కదా.. ఇంకేంటి సమస్య అంటారా..? అయితే ఇది చదివేయండి..
ఓడినా.. గెలిచినా దీర్ఘకాలిక ప్రణాళికల్లో మార్పులుండవు: పాండ్య
అభిమానుల ఆగ్రహానికి హార్దిక్ పాండ్య గురికావడానికి ప్రధాన కారణం సిక్స్తో ఇన్నింగ్స్ను ముగించడం. భారత్ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్య సిక్స్ కొట్టాడు. దీంతో మరో వైపు ఎండ్లో ఉన్న తిలక్ వర్మ 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఒక్క పరుగు చేస్తే అతడి ఖాతాలో హాఫ్ సెంచరీ వచ్చి చేరేది. వరుసగా రెండు అర్ధశతకాలు చేసినట్లు అయ్యేది. కానీ, ఇలా జరగకుండా సిక్స్ కొట్టిన హార్దిక్ పాండ్యపై విమర్శలతోపాటు నెట్టింట విపరీతంగా ట్రోలింగ్కు తెరలేచింది. ఇదేమీ చివరి బంతి కాదు కదా.. నెట్రన్రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటూ ఫ్యాన్స్ చురకలు అంటించారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇరవై ఏళ్ల కిందట చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేశారు.
అప్పుడు ద్రవిడ్ కూడా ఇలానే..
ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 2001/02 సీజన్లో విమర్శలపాలైన సంగతి తెలిసిందే. పాక్తో మ్యాచ్ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేస్తూ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ మ్యాచ్లోనే వీరేంద్ర సెహ్వాగ్ త్రిశతకం సాధించాడు. అయితే, ఆ మ్యాచ్లోనూ భారత్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించినా ద్రవిడ్ నిర్ణయం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు