Sachin Tendulkar: క్రికెట్ దేవుడి ‘ఫిఫ్టీ’.. ఈ ఏడాది సచిన్కు ఎంతో స్పెషల్!
క్రికెట్ దిగ్గజం సచిన్ (Sachin) తన క్రికెట్ కెరీర్లో ఎన్నో శతకాలు, అర్ద శతకాలు నమోదు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత క్రికెట్ను ఊర్రూతలూగించిన నేడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin) 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమై పదేళ్లకుపైగా సమయం గడిచినా క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. తన కుమారుడు అర్జున్ తెందూల్కర్ తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోకి అడుగు పెట్టాడు. తాను ఒకప్పుడు కెప్టెన్గా వ్యవహరించి.. ప్రస్తుతం మెంటార్గా ఉన్న ముంబయి ఇండియన్స్ జట్టులోనే అర్జున్ ఆడటం విశేషం. రెండు రోజుల కిందటే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా సచిన్తో ముంబయి క్రికెటర్లు కేక్ను కోయించారు. ఇవాళ సచిన్కు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీస్థాయిలో విషెస్ అందాయి. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికతో సచిన్ పలు కీలక విషయాలపై మాట్లాడాడు.
అస్సలు ఆలోచించట్లేదు..
చాలామంది 50 సంవత్సరాలు వచ్చాయి కదా.. ఎలా ఉంది అని అడుగుతుంటారు. నిజాయతీగా చెప్పాలంటే.. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించను. నా జీవితంలో 24 ఏళ్లు క్రికెట్ ఆడేశా. అది నా మొదటి ఇన్నింగ్స్. గత పదేళ్ల నుంచి రెండో ఇన్నింగ్స్లో ఉన్నా. అందుకే నేను పాతికేళ్ల కుర్రాడిలానే ఫీలవుతా. ఇప్పటికీ నా స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడటం.. వారిని ఆటపట్టించడం చేస్తుంటా. అప్పుడే మనల్ని మనం శారీరకంగా, మానసికంగా యంగ్గా ఉంచుకోవచ్చు.
దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వకారణమే
నేను టీమ్ఇండియా కోసం పదేళ్ల కిందట చివరిసారిగా ఆడాను. భారత జట్టుకు ఆడటం ఎప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. మైదానంలో సవాళ్లు, సహచరులతో డ్రెస్సింగ్ రూమ్ అనుభవాలు.. అన్నీ మధుర జ్ఞాపకాలే. అయితే ఇదేమీ శాశ్వతం కాదని తెలుసు. క్రికెట్కు వీడ్కోలు పలికే చివరి మ్యాచ్లోనూ ఎన్నో అనుభవాలు ఆస్వాదించా. అందుకే, ఇప్పటికీ నేనేం మిస్ కాలేదనే భావన నాలో ఉంది.
పొట్టి ఫార్మాట్తోపాటు టెస్టు క్రికెట్ ఉండాలి
క్రికెట్ ఫార్మాట్లను బ్యాలెన్స్డ్గా సరిచేయాలి. వాణిజ్యపరంగానే కాకుండా క్రికెటింగ్ స్కిల్స్పైనా దృష్టి పెట్టాలి. ఇప్పటి యువత టీ20 ఫార్మాట్ను బాగా ఇష్టపడుతున్నారు. అలాగే టెస్టు క్రికెట్ కూడా వేగంగా ముందుకు సాగిపోవాలి. టెస్టు క్రికెట్ కనుమరుగయ్యే రోజు ఎవరూ చూడకూడదు. బౌలర్కు పిచ్ అనుకూలంగా ఉంటే మ్యాచ్లు రసవత్తరంగా మారేందుకు అవకాశం ఉంటుంది.
అలా జడ్జ్ చేయకూడదు..
టెస్టు మ్యాచ్ ఫలితాలను ఎప్పుడూ రోజులతో కొలవకూడదు. ఐదు రోజులు జరిగిందా..? రెండున్నర రోజుల్లోనే ముగిసిందా..? అనేది పక్కన పెట్టాలి. నాణ్యమైన క్రికెట్ ఆడితే ఆ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసినా ఫర్వాలేదు. ఎందుకంటే ఛాలెంజింగ్ వికెట్ ఉండటం వల్ల ఇరు జట్లూ విజయం కోసం పోరాడతాయి. అప్పుడే ఆటగాళ్లలోని స్కిల్స్ బయటపడతాయి.
నాకైతే తెలియదు..
మా కాలంలో టీ20 ఫార్మాట్ ఉండుంటే నా బ్యాటింగ్ శైలిలో మార్పులు వచ్చేవో లేదో నాకైతే తెలియదు. మేం ఆడిన సమయంలో చాలా మందికి టీ20 ఫార్మాట్ గురించి అర్థం కాలేదు. అయితే, ఇప్పుడు నా దృష్టిలో పొట్టి ఫార్మాట్ చాలా సులభం. వన్డేల్లో, టెస్టుల్లో రోజుల తరబడి శారీరకంగా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు టీ20లు కేవలం మూడున్నర గంటల్లోనే ముగుస్తున్నాయి. బౌలర్లు కూడా పెద్ద స్పెల్స్ వేయాల్సిన అవసరం లేదు.
2007 వరల్డ్ కప్...
నా క్రీడా జీవితంలో ఏవైనా మార్పులు రావాలని కోరుకోవాలనుకుంటే.. 2005 నుంచి 2007 మధ్య భారత క్రికెట్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటా. ఆ రెండేళ్లు భారత్ క్రికెట్కు కష్టకాలం. అలాగే 90వ దశకంలోని చివరి రోజుల్లోనూ టీమ్ఇండియా నుంచి సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాం. ఈ రెండు సందర్భాల్లో మార్పు రావాలని భావిస్తున్నా.
మార్పు మొదలైంది..
భారత క్రికెట్లో ఇప్పటికే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు, మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. ఇలా మార్పు మొదలైంది. ఇలా చేయడం వల్ల బాలికలు క్రీడారంగంలోకి వచ్చేందుకు తలుపులు తెరిచినట్లు అయింది. నేను ‘సచిన్ తెందూల్కర్ ఫౌండేషన్ ’ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, విద్య, క్రీడా రంగాలపై కృషి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్