MI-CSK: అవన్నీ రూమర్స్ అన్న సీఎస్కే సీఈవో.. ‘వచ్చే తరానికి రోహిత్ మార్గనిర్దేశం’
రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్గా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని ట్రేడ్ చేసుకోవడానికి ఒకట్రెండు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపాయని ప్రచారం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తొలగించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను నియమించిన సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు తప్పుపడుతున్నారు. హిట్మ్యాన్కు మద్దతుగా నిలుస్తూ అదే సమయంలో ముంబయి మేనేజ్మెంట్పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మరో జట్టులో చేరతాడనే ప్రచారం జరిగింది. అతడు ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాడా? అని ఒకట్రెండు ఫ్రాంఛైజీలు ఆరా తీశాయని వార్తలొచ్చాయి. రోహిత్ శర్మతోపాటు ముంబయిలోని టాప్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాల ట్రేడింగ్ కోసం ఓ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపిందట. ముంబయి ఆటగాళ్లపై కన్నేసిన ఫ్రాంఛైజీల్లో సీఎస్కే (CSK) కూడా ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, తమ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్తో ట్రేడింగ్కు దూరంగా ఉంటుందని సీఎస్కే సీఈవో కాశీవిశ్వనాథన్ స్పష్టం చేశాడు. ‘‘మా ఫ్రాంఛైజీ నియమ నిబంధనల ప్రకారం మేము ఆటగాళ్లను ట్రేడ్ చేయం. ముంబయి ఇండియన్స్తో ట్రేడింగ్ చేయడానికి మా వద్ద ఆటగాళ్లు కూడా లేరు. మేం వారిని సంప్రదించలేదు. ఆ ఉద్దేశం కూడా లేదు’’ అని పేర్కొన్నారు.
రోహిత్ వచ్చే తరానికి మార్గనిర్దేశం చేస్తాడు: జయవర్ధనె
రోహిత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై ముంబయి ఇండియన్స్ పర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధనె (Mahela Jayawardene) మరోసారి స్పందించాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని, వారసత్వ నిర్మాణంలో భాగంగా ఈ మార్పునకు ఉపక్రమించామని తెలిపాడు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. నిజాయితీగా చెప్పాలంటే ఎమోషనల్ మూమెంట్. అభిమానులు అలా స్పందించడంలో కూడా న్యాయం ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనై ఉంటారని భావిస్తున్నాను. మనం కూడా దానిని గౌరవించాలి. కానీ, ఒక ఫ్రాంఛైజీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వారసత్వ నిర్మాణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వచ్చే తరానికి మార్గనిర్దేశం చేయడానికి జట్టులో రోహిత్ శర్మ మైదానం లోపల, వెలుపల ఉండటం మాకు చాలా ముఖ్యం. అతను ఎంతో ప్రతిభావంతుడు. జట్టును నడిపించే వారసత్వంలో భాగమవుతాడు. యువ ఆటగాళ్లతో ఆడిన సచిన్.. జట్టు సరైన దిశలో వెళుతుందని నిర్ధారించుకుని వేరొకరికి కెప్టెన్సీ అప్పగించాడు. ఇది కూడా అలాంటిదే’’ అని జయవర్ధనె పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.