DC: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫ్రాంచైజీతో జట్టు కట్టిన దిల్లీ క్యాపిటల్స్
అమెరికాలోనూ క్రికెట్ను విస్తరించడానికి తమవంతు సహకారం అందించడానికి దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నడుంబిగించింది. దీనిలో భాగంగా సత్య నాదెళ్ల భాగస్వామిగా ఉన్న ఫ్రాంచైజీతో జట్టు కట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణ కోసం భారీస్థాయిలో లీగ్లు జరుగుతున్నాయి. ఐపీఎల్, బిగ్బాష్ లీగ్, అబుదాబి టీ10 లీగ్, దక్షిణాఫ్రికా లీగ్.. ఇలా సందడి నెలకొంది. తాజాగా అమెరికాలోనూ క్రికెట్ ఖ్యాతిని పెంచేందుకు కొత్తగా టీ20 ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ సిద్ధమవుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) పేరిట ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో జట్టు కడుతున్నట్లు ప్రకటించింది.
టెక్ దిగ్గజం సత్య నాదెళ్లకు (Satya Nadella) భాగస్వామ్యం ఉన్న సియాటెల్ ఫ్రాంచైజీతో దిల్లీ క్యాపిటల్స్ కలిసి పనిచేయనుంది. ‘సీయాటెల్ ఆర్కాస్’ పేరుతో ఎంఎల్సీలో ఆడనుంది. ‘‘దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్ త్వరలోనే సీయాటెల్ ఆర్కాస్తో జట్టు కట్టనుంది. ప్రపంచ స్థాయి క్రికెట్ జట్టును తయారు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది’’ అని MLC ఓ ప్రకటనలో పేర్కొంది. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు కూడా భాగస్వామ్యాలు ఉన్నాయి.
సుదీర్ఘ అనుభవం ఉండటం వల్లే..
‘‘దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ప్లేఆఫ్స్కు చేరుకొంది. అలాగే 2021 సీజన్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. పసిఫిక్ నార్త్వెస్ట్ ప్రాంతంలో క్రికెట్ను విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా జట్టుకు ఆర్కాస్ పేరు పెట్టడం వెనుక కారణం ఉంది. స్థానిక కమ్యూనిటీని ప్రతిబింబించేలా పెట్టడం జరిగింది. క్రీడా స్ఫూర్తిని చాటేందుకు సహాయ పడుతుంది ’’ అని ఆర్కాస్ ఇన్వెస్టర్ గ్రూప్ తెలిపింది. ఈ గ్రూప్లో సత్య నాదెళ్లతోపాటు మడ్రోనా వెంచర్స్ ఎండీ సోమ సోమసెగర్, ఐసెర్టిస్ సీఈవో సమీర్ బోడాస్, గ్రేట్ పాయింట్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ కృష్ణమూర్తి, మైక్రోసాఫ్ట్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ పార్థసారథి ఉన్నారు.
ఆర్కాస్తో జట్టుకట్టడంపై దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంథి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయంగా క్రికెట్ వృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు కలిగిన దేశాల్లో అమెరికా ఒకటని మా భావన. సీటల్ ఆర్కాస్తో కలిసి పని చేయడం వల్ల మెరుగైన ఫలితాలను సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు