Ind vs Eng: టీమ్ఇండియా కెప్టెన్గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్
భారత్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారంప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టుని ప్రకటిస్తే టీమ్ఇండియా కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఖరారు చేసింది . భారత జట్టుకు జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వైస్ కెప్టెన్గా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జస్ప్రిత్ బుమ్రాను కెప్టెన్గా నియమించింది. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. రోహిత్ శర్మ కరోనా బారినపడి, పూర్తి ఫిట్నెస్తో లేకపోవడంతో బుమ్రాను కెప్టెన్గా ఖరారు చేశారు. భారత తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు ఇంగ్లాండ్ ఫైనల్ 11ను ప్రకటించింది. న్యూజిలాండ్తో చివరి టెస్టులో ఆడని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ స్థానంలో ఎంపికైన శామ్ బిల్లింగ్స్కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి మరో అవకాశం లభించింది. ఈ సిరీస్లో ఫర్వాలేదనిపించిన మరో ఓపెనర్ అలెక్స్ లీస్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, కెప్టెన్ స్టోక్స్లతో మిడిలార్డర్ దుర్భేద్యంగా ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లీచ్, సీనియర్ పేసర్ బ్రాడ్, యువ సంచలనం మాథ్యూ పోట్స్లతో బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉంది. న్యూజిలాండ్తో చివరి టెస్టులో 97 పరుగులతో పాటు 2 వికెట్టు పడగొట్టిన ఓవర్టన్ అండర్సన్ రాకతో రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యాడు.
గతేడాది నాలుగు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పటికి టీమ్కు పోలికే లేదు. కెప్టెన్తో సహా ఏడుగురు మారారు. అప్పుడు ఆడిన జో రూట్, ఓలీ పోప్, జానీ బెయిర్స్టో, జేమ్స్ అండర్సన్ మాత్రమే ఐదో టెస్టులో ఆడటం గమనార్హం. సిరీస్లో భారత్ మొదటి మ్యాచ్ డ్రా చేసుకున్న భారత్ రెండింట్లో గెలిచింది. కరోనా కారణంతో చివరి టెస్టు వాయిదా పడిన నాటికి భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
గురువారమూ పాజిటివ్: కరోనా బారిన పడిన రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. ఈ రోజు ఉదయం చేసిన రాపిడ్ టెస్ట్లోనూ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతను మరికొన్ని రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. వరుసగా రెండు ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వస్తేనే రోహిత్ను ఆటకు అనుమతిస్తామని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత