IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్.. 15 పాయింట్లు చాలు.. 16 పాయింట్లు ఉన్నా కష్టమే: ఆకాశ్ చోప్రా
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, టీమ్ఇండియా మాజీ ఆటగాడు, క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా మాత్రం విభిన్నంగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్, బెంగళూరు మినహా అన్ని జట్లూ పదమూడేసి మ్యాచ్లను ఆడేశాయి. నేడు ఆ రెండు టీమ్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. గుజరాత్ (18 పాయింట్లు) ప్లేఆఫ్స్కు వెళ్లిపోగా.. చెన్నై (15 పాయింట్లు), లఖ్నవూ (15 పాయింట్లు), ముంబయి (14 పాయింట్లు) ఇప్పటి వరకు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇవన్నీ తమ చివరి మ్యాచ్లను గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్కు చేరిపోతాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే 15 పాయింట్లు ఉన్నా సరిపోతుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. 16 పాయింట్లు రాని పక్షంలో 15 పాయింట్లు, 14 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అవుతాయని పేర్కొన్నాడు.
‘‘ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో ఉన్న జట్లు ప్లేఆఫ్స్కు చేరతాయి. 16 పాయింట్లు ఉన్నా చేరకపోవచ్చు. ఇదొక అద్భుతమైన సీజన్ కాబోతోంది. ఇప్పుడు చెన్నై, లఖ్నవూ తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే 17కి చేరతాయి. అప్పుడు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. ఇక ముంబయి, బెంగళూరు 16 పాయింట్లతో ఉంటే నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ఇలా ఒక జట్టు 16 పాయింట్లతో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్కు వెళ్లదు. అలా కాకుండా సీఎస్కే, ఎల్ఎస్జీ 15 పాయింట్లతో లీగ్ స్టేజ్ను ముగించినా క్వాలిఫై అవుతాయి. అప్పుడు బెంగళూరు, ముంబయి 16 పాయింట్లకు చేరకూడదు. అంటే ముంబయి తన చివరి మ్యాచ్లో ఓడితే 14పాయింట్ల వద్దే ఉంటుంది. ఇక బెంగళూరు మిగిలిన రెండింట్లోనూ ఓడితే 12 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. అప్పుడు 15 పాయింట్లు, 14 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్లోకి ఎంట్రీ లభిస్తుంది. సూపర్ సీజన్’’ అంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. కోల్కతాతో లఖ్నవూ, హైదరాబాద్తో ముంబయి ఆడాల్సి ఉంది. ఇక బెంగళూరుకు రెండు మ్యాచ్లు ఉన్నాయి. నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుండగా.. మే 21న గుజరాత్ను ఢీకొట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..