Shreyas Iyer: శ్రేయస్ మళ్లీ ఫామ్లోకి రావాలంటే.. అదొక్కటే మార్గం: భారత మాజీ క్రికెటర్లు
ఇంగ్లాండ్పై శతకంతో గిల్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అయితే, సీనియర్ బ్యాటర్ శ్రేయస్ మాత్రం వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో (IND vs ENG) జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విఫలమయ్యాడు. వచ్చిన శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. సిరీస్లో ఇంకా మూడు టెస్టులు మిగిలిన నేపథ్యంలో.. వాటికి అయ్యర్ను ఎంపిక చేయడంపై సందిగ్ధత నెలకొంది. యువకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. వరుసగా విఫలమవుతున్న సీనియర్ను పక్కన పెట్టాలనే డిమాండ్లూ వస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ను జట్టులో కొనసాగించి.. శ్రేయస్ను దేశవాళీలో ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు.
‘‘ఇప్పుడు జట్టులో ఉన్న వారిలో శ్రేయస్ అయ్యర్ కాస్త వెనుకబడ్డాడు. గాయం నుంచి కోలుకొన్నాక మైదానంలో సత్తా చూపాలి. గతంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం తర్వాత అదరగొట్టేశారు. నేరుగా తుది జట్టులోకి వచ్చి ఆడారు. ఇప్పుడు శ్రేయస్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. రజత్ పటీదార్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ విరాట్, కేఎల్ రాహుల్ మిగతా టెస్టుల కోసం జట్టులోకి వస్తే మాత్రం వీరి స్థానాలకు ఇబ్బందే. అయ్యర్ మళ్లీ ఫామ్లోకి రావాలంటే వెంటనే దేశవాళీ క్రికెట్ ఆడాలి. భారీగా పరుగులు చేయాలి’’ అని ఓజా వ్యాఖ్యానించాడు.
మంచి అవకాశాలను వృథా చేసుకొన్నావు: జహీర్
‘‘స్పిన్ బౌలింగ్ను అద్భుతంగా ఆడే శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో లభించిన అవకాశాలను వృథా చేసుకున్నాడు. పర్యటక జట్టు కేవలం ఒకే ఒక్క పేసర్తో తొలి రెండు టెస్టులను ఆడింది. రెండో టెస్ట్లో అండర్సన్ బౌలింగ్ను అడ్డుకొని ఉంటే సరిపోయేది. కానీ, ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలనే అతివిశ్వాసంతో శ్రేయస్ ఔటయ్యాడు. దీంతో తర్వాత మ్యాచుల్లో అవకాశాలు దక్కుతాయో..? లేదో? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి’’ అని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు