IND vs SL : మయాంక్‌.. నీ స్థానం ఎప్పుడు భద్రంగా ఉండదో తెలుసు కదా!: గంభీర్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెనర్...

Published : 05 Mar 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ప్రదర్శనపై మాజీ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. భారీ స్కోర్లను సాధించకపోతే జట్టులో స్థానం సుస్థిరం కాదనే విషయం మయాంక్‌కు తెలుసునని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. లంకతో తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకు మయాంక్‌ ఔటయ్యాడు. అప్పటి వరకు క్రీజ్‌లో కుదురుకున్న అగర్వాల్.. లంక స్పిన్నర్‌ ఎంబుల్దేనియాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్‌ (29)తో కలిసి అర్ధశతక (52) భాగస్వామ్యం నిర్మించాడు. 

‘‘లహిరు కుమార, ఎంబుల్దేనియా మినహా మిగతా లంక బౌలర్లు మయాంక్‌ను ఇబ్బంది పెట్టలేదు. లహిరును కూడా బాగానే  ఎదుర్కొన్నాడు. అయితే క్రీజ్‌లో పాతుకుపోయినట్లు కనిపించిన మయాంక్‌ ఆఖరికి స్పిన్నర్‌కు వికెట్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వస్తాడో అప్పుడు నీకు (మయాంక్‌) జట్టులో స్థానం ఉంటుందనే భరోసా లేదు. అందుకే భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. మరోవైపు వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 45 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని