సంక్షిప్త వార్తలు (8)
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ లీగులు వస్తున్నప్పటికీ.. ఆర్థికంగా బలంగా ఉన్న లీగులు కొన్ని మాత్రమే దీర్ఘకాలంలో మనగలుగుతాయని మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు.
మిగిలేది కొన్ని లీగ్లే: గంగూలీ
కోల్కతా: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ లీగులు వస్తున్నప్పటికీ.. ఆర్థికంగా బలంగా ఉన్న లీగులు కొన్ని మాత్రమే దీర్ఘకాలంలో మనగలుగుతాయని మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వస్తున్న లీగ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐపీఎల్నే తీసుకుంటే.. దానికో భిన్నమైన వ్యవస్థ ఉంది. అది భిన్నమైన లీగ్. ఆస్ట్రేలియాలో బిగ్బాష్కి మంచి ఆదరణే ఉంది. అలాగే ఇంగ్లాండ్లో హండ్రెడ్స్, దక్షిణాఫ్రికాలో ఎస్ఏ లీగ్లు బాగానే ఉన్నాయి. ఎస్ఏ లీగ్ను మూడు వారాలుగా చూస్తున్నా. ఆయా దేశాల్లో క్రికెట్కు మంచి ఆదరణ ఉండడం ఈ లీగుల్లో ఉమ్మడి అంశం. ముందు ముందు నాలుగైదేళ్లలో కొన్ని లీగ్లు మాత్రమే నిలబడతాయి. ఇప్పుడైతే లీగ్లు కొత్త. అందరూ అందులో ఆడాలనుకుంటారు. కానీ చివరికి లీగ్లలాగే దేశం కూడా ముఖ్యమైందని అందరికీ అర్థమవుతుంది. మంచి వ్యవస్థ ఉన్న లీగ్లే మిగులుతాయి’’ అని గంగూలీ అన్నాడు.
ఆసియా అథ్లెటిక్స్కు జ్యోతి
దిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఫిబ్రవరి 10న కజకిస్థాన్లోని అస్తానాలో ఆరంభమయ్యే ఈ టోర్నీలో జ్యోతి.. మహిళల 60 మీటర్ల పరుగు, 60 మీటర్ల హర్డిల్స్ విభాగాల్లో పోటీపడనుంది. స్వప్న బర్మన్ (పెంటాథ్లాన్) తజిందర్పాల్ సింగ్ (షాట్పుట్) జెస్విన్ అల్డ్రిన్, మహ్మద్ అనీస్ (లాంగ్జంప్) లాంటి స్టార్లు ఈ టోర్నీ బరిలో ఉన్నారు.
క్రీడలకు రూ.134.80 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఈ సారి క్రీడా రంగానికి కేటాయింపులు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు. 2022-23 (రూ.81.01 కోట్లు)తో పోలిస్తే ఈ సారి రూ.53.79 కోట్లు పెంచారు. బడ్జెట్లో తొలిసారిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం రూ.45 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాకాలు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్)కు నిధులు పెరగగా.. తెలంగాణ ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్ క్రీడా వసతి గృహానికి తగ్గాయి. స్టేడియాల నిర్మాణాలకు, క్రీడా వసతుల ఆధునికీకరణకు రూ.30 కోట్లు ఇచ్చారు. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాలకు రూ.15 కోట్లు, శాట్స్కు రూ.20.74 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్ క్రీడా వసతి గృహానికి రూ.16.53 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన క్రీడా పాఠశాలకు రూ.7.53 కోట్ల చొప్పున కేటాయించారు.
గురునాయుడికి పసిడి
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్.గురునాయుడు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. బాలుర 55 కిలోల విభాగంలో బరిలోకి దిగిన గురునాయుడు స్నాచ్లో 103 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 124 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 227 కిలోలతో మొదటి స్థానంలో నిలిచాడు.
మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్
దిల్లీ: మొట్టమొదటి మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మార్చి 4 నుంచి 26 వరకు ముంబయిలో జరగనుంది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ ఈ విషయం చెప్పాడు. బ్రబౌర్న్ స్టేడియం, డీవీ పాటిల్ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి.ఈ లీగ్ కోసం దాదాపు 1500 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఈ వారం విడుదల చేసే అవకాశముంది. ఈ నెల 13న క్రికెటర్ల వేలం ఉంటుంది.
అశ్విన్ ఒక తుపాకీ: ఖవాజా
బెంగళూరు: రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని భారత స్పిన్ బృందాన్ని ఎదుర్కోవడమే రాబోయే నాలుగు టెస్టుల సిరీస్లో అతి పెద్ద సవాలని ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అభిప్రాయపడ్డాడు. చక్కటి ఫామ్లో ఉన్న ఖవాజా టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాకు కీలకం అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో అతను స్పందిస్తూ.. ‘‘భారత్లో ఆడడం భిన్న అనుభవం. గత పదేళ్లలో మా జట్టు భిన్న రకాల పిచ్లపై ఎలా ఆడాలో అనుభవం సాధించింది. అయినా సరే.. భారత్లో ఆడడం కష్టమే. అశ్విన్ ఒక తుపాకీ లాంటి వాడు. అతడిలో గొప్ప నైపుణ్యం ఉంది. బంతులకు కొంచెం వైవిధ్యం జోడించి తికమక పెడతాడు. భారత స్పిన్ దాడిని ఎదుర్కోవడం మాకొక మంచి సవాలు. ఇక్కడి పిచ్లపై తొలి రోజైనా, నాలుగో రోజైనా బంతి తిరుగుతుంది. అశ్విన్ను నేనెలా ఎదుర్కొంటాను, పరుగులు చేస్తానన్నది కీలకం. అతను ప్రతి ఓవర్లో ఒకేలా ఉండడు. అతణ్ని ఎదుర్కోవడానికి మనం చాలా కష్టపడాలి’’ అని చెప్పాడు.
అశ్విన్తో జాగ్రత్త: ఇయాన్
నాగ్పుర్: ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని, ఆస్ట్రేలియా బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ హెచ్చరించాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇయాన్ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ తెలివైన క్రికెటర్. అందుకే అతడితో ఎప్పుడూ సమస్యే. తాను కోరుకున్నట్లుగానే అశ్విన్ను బౌలింగ్ చేయనిస్తే ఆసీస్ ప్రమాదంలో పడినట్లే. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేటప్పుడు కంగారూ బ్యాటర్లు చురుగ్గా ఉండాలి. సాహసాలకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తే..అతడు వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. ఇక రిషబ్ లేకపోవడం టీమ్ఇండియాకు పెద్ద లోటు. ఆస్ట్రేలియాకు ఇది ఊరటనిచ్చే అంశం’’ అని అన్నాడు. లైయాన్ ఆఫ్స్టంప్కు ఆవల బంతి ఎక్కువ స్పిన్ అవుతూ బ్యాటర్లు అందుకోలేని విధంగా బంతులేయాలని సూచించాడు. ‘‘లైయాన్ భారత బ్యాటర్లకు అందని కోణంలో ఆఫ్సైడ్ బంతులు విసరాలి. ఇలా వేస్తూ ఒక్కసారిగా వికెట్ల మీదకు బంతిని తిప్పితే బ్యాటర్ బౌల్డ్, బ్యాట్ అండ్ ప్యాడ్ లేదా ఎల్బీ అయ్యే అవకాశాలు ఉంటాయి’’ అని చెప్పాడు.
భారత్ను తొలగించండి: మియాందాద్
కరాచి: ఆసియా కప్ వేదిక వ్యవహారంలో భారత్ నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తప్పుబట్టాడు. భారత్ ఏమైపోయినా తమకు అనవసరమని తెలిపాడు. ఆసియా కప్ను పీసీబీ పాక్లో నిర్వహించాలని భావిస్తుండగా.. ఆ దేశానికి తమ ఆటగాళ్లు రారంటూ బీసీసీఐ కుండబద్దలు కొట్టింది. దీంతో యూఏఈకి వేదికను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘నేనెప్పుడూ చెప్పేది ఒక్కటే.. భారత్ ఏమైపోయినా మేం పట్టించుకోం. మా క్రికెట్ మాకొస్తుంది. ఇలాంటి వాటిని నియంత్రించడం ఐసీసీ విధి. లేకపోతే పాలక మండలి ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి దేశానికి ఐసీసీ ఒకే నిబంధన పాటించాలి. ఎంతటి బలమైన జట్లైనా పర్యటనలకు రాకపోతే తొలగించాల్సిందే’’ అని మియాందాద్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్తో కోల్కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?