ODI World Cup: ప్రపంచకప్ సన్నాహానికి దెబ్బ
వన్డే ప్రపంచకప్ అక్టోబరు-నవంబరులో జరగనుంది. మరీ ఎక్కువ సమయమేమీ లేదు. జట్లన్నీ ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్పై ప్రధానంగా దృష్టి పెట్టి సంసిద్ధమవుతున్నాయి.
వన్డే ప్రపంచకప్ దగ్గరపడుతోంది. ఇక నుంచి ఆటగాళ్లు, అభిమానుల దృష్టంతా అటే. పైగా టీమ్ఇండియా సొంతగడ్డపై ఆడుతోంది. చివరిసారి (2011) స్వదేశంలో ఆడినప్పుడు ధోని నేతృత్వంలోనే కప్పును అందుకుంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలే ఉన్నాయ్! కానీ పరిస్థితులే అంత అనుకూలంగా లేవు. గాయాలు, ఫిట్నెస్ లేమి భారత జట్టు సన్నాహాలకు అడ్డంకిగా మారాయి.
ముంబయి: వన్డే ప్రపంచకప్ అక్టోబరు-నవంబరులో జరగనుంది. మరీ ఎక్కువ సమయమేమీ లేదు. జట్లన్నీ ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్పై ప్రధానంగా దృష్టి పెట్టి సంసిద్ధమవుతున్నాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో రోహిత్సేన వన్డే సిరీస్ ఆడబోతోంది. కానీ ఆటగాళ్లకు వరుస గాయాలు భారత జట్టును కలవర పెడుతున్నాయి. తాజాగా శ్రేయస్ అయ్యర్ వెన్ను సమస్యతో ఆసీస్తో సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్లోనూ కొన్ని మ్యాచ్లకు అతడు దూరమయ్యే అవకాశముంది. శ్రేయస్ ఫిట్గా ఉన్నట్లు ఎన్సీఏ ప్రకటించిన కొన్ని రోజులకే అతడి పరిస్థితి మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాల నిర్వహణ తీరుపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా చాలా పెద్దదే. వెన్ను గాయంతో ఇప్పటికే చాలా నెలలు ఆటకు దూరమైన ప్రధాన పేసర్ బుమ్రా ఇటీవలే శస్త్రచిత్స చేయించుకున్నాడు. ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. అసలు ప్రపంచకప్లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. జడేజా సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశాడు. స్పీడ్స్టర్ దీపక్ చాహర్ కూడా పదే పదే గాయపడుతుండడం జట్టు మేనేజ్మెంట్కు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గాయాల నిర్వహణపై ఎన్సీఏలోని స్పోర్ట్స్ సైన్స్ విభాగం నుంచి బీసీసీఐ వివరణ కోరినట్లు తెలుస్తోంది. నిరుడు టీ20 ప్రపంచకప్కు ముందు ఆటగాళ్లను రొటేట్ చేసినందుకు విమర్శలు రావడంతో.. వన్డే ప్రపంచకప్కు సన్నద్ధమయ్యే క్రమంలో 18-20 మంది ఆటగాళ్లతోనే ఆడతామని సెలక్షన్ కమిటీ, భారత జట్టు మేనేజ్మెంట్ జనవరిలో చెప్పాయి. కానీ ముఖ్య ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో ప్రధాన బృందంతో ఆడడం ఎలా సాధ్యమన్నది ప్రశ్న. ‘‘ఆటగాళ్లపై ఎక్కువ పనిభారం పడనివ్వట్లేదు. అయినా ప్రధాన ఆటగాళ్లు పదే పదే గాయపడుతున్నారు. దీని గురించి బీసీసీఐ.. ఎన్సీఏ అధికారులతో మాట్లాడింది. టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ ఇప్పుడు బ్యాకప్ ఆటగాళ్లను గుర్తించడంపై దృష్టి పెట్టాయి’’ అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. ఏడాదికి 30 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న భారత క్రికెటర్లు చాలా తక్కువే. అయినా గాయకుల జాబితా పెద్దదిగా ఉండడం బోర్డుకు అంతుపట్టట్లేదు. ప్రసిద్ధ్ కృష్ణను ప్రపంచకప్కు సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావించింది. కానీ అతడు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేడు. వెన్నుకు శస్త్రకిత్స చేయించుకున్న ప్రసిద్ధ్ ఐపీఎల్కు దూరమయ్యాడు. నిరుడు ఆగస్టు (జింబాబ్వేతో వన్డే) తర్వాత అతడు మళ్లీ ఆడలేదు. రెండో ప్రాధాన్య పేసర్ల విషయంలో కూడా జట్టు మేనేజ్మెంట్కు స్పష్టత లేదు. ఆసియాకప్ తర్వాత జట్టుకు దూరమైన అవేష్ ఖాన్ కూడా రంజీ ట్రోఫీ సందర్భంగా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్కు సన్నద్ధం కావడం టీమ్ఇండియాకు పెను సవాలే. ‘‘ఆటగాళ్లకు అవుతున్నవి తీవ్రమైన గాయాలే. కోలుకుని, పూర్తి ఫిట్నెస్ను అందుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక స్థిరమైన భారత జట్టును సిద్ధం చేయడం పెద్ద సవాలే’’ అని బోర్డు అధికారి అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత