సంక్షిప్త వార్తలు (5)
పురుషుల హాకీ ప్రపంచకప్కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు హాకీ ఇండియా (హెచ్ఐ)కు ఆసియా హాకీ సమాఖ్య నుంచి ‘ఉత్తమ నిర్వహణ’ అవార్డు లభించింది.
హాకీ ఇండియాకు ఉత్తమ నిర్వహణ అవార్డు
దిల్లీ: పురుషుల హాకీ ప్రపంచకప్కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు హాకీ ఇండియా (హెచ్ఐ)కు ఆసియా హాకీ సమాఖ్య నుంచి ‘ఉత్తమ నిర్వహణ’ అవార్డు లభించింది. కొరియాలో జరిగిన ఆసియా హాకీ సమాఖ్య సమావేశంలో హెచ్ఐ ప్రధాన కార్యదర్శి భోళానాథ్ సింగ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భువనేశ్వర్, రవూర్కెలా వేదికలుగా ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచకప్ జరిగింది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు సలీమా టెట్ను ఆసియా హాకీ సమాఖ్య అథ్లెట్స్ రాయబారిగా నియమించారు. 2021 మహిళల జూనియర్ ప్రపంచకప్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు సలీమా కెప్టెన్. రాయబారిగా ఆసియా నుంచి ఎంపికైన నలుగురిలో సలీమా ఒకరు.
భారత జట్లకు ఆసియా ఖోఖో టైటిల్
తముల్పుర్ (అసోం): ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్లో భారత్ పురుషులు, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. గురువారం పురుషుల ఫైనల్లో మన జట్టు 33 పాయింట్లు, ఇన్నింగ్స్ తేడాతో నేపాల్ను ఓడించింది. మహిళల తుది పోరులో బంగ్లాదేశ్పై భారత్ 49 పాయింట్లు, ఇన్నింగ్స్తో విజయాన్ని సొంతం చేసుకుంది.
బెయిర్స్టోకు అనుమతి లేదు
దిల్లీ: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ఈ ఏడాది ఐపీఎల్కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడికి ఐపీఎల్లో ఆడేందుకు కావాల్సిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వడానికి ఇంగ్లాండ్ బోర్డు (ఈసీబీ) నిరాకరించింది. అతడికి మరింత విశ్రాంతి అవసరమని ఈసీబీ భావించడమే కారణం. నిరుడు సెప్టెంబరులో బెయిర్స్టో కాలికి గాయమైంది. మోకాలి, చీలమండ గాయాల నుంచి కోలుకున్న ఆల్రౌండర్ లివింగ్స్టోన్కు ఐపీఎల్లో ఆడేందుకు ఈసీబీ అనుమతిచ్చింది. ఆటగాళ్ల వేలంలో లివింగ్స్టోన్ను రూ.11.50 కోట్లు, బెయిర్స్టోను రూ.6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది.
హాంకాంగ్ లీగ్కు ప్రణవి, మమతకు ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: క్రికెట్ హాంకాంగ్ నిర్వహిస్తున్న ఫెయిర్బ్రేక్ టీ20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు తెలుగమ్మాయిలు ప్రణవి చంద్ర, మమతకు ఆహ్వానాలు అందాయి. ఐసీసీ అనుమతితో ఏప్రిల్ 1 నుంచి 16 వరకు హాంకాంగ్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తెచ్చుకుని టోర్నీలో బరిలో దిగొచ్చంటూ ప్రణవి, మమతకు పంపిన ఆహ్వానంలో క్రికెట్ హాంకాంగ్ పేర్కొంది. డాని వ్యాట్, సోఫియా డంక్లే, సీవర్ బ్రంట్ (ఇంగ్లాండ్), హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్, డాటిన్ (వెస్టిండీస్), లారా వోల్వార్డ్, షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజేనె కాప్, అయబొంగ ఖాక (దక్షిణాఫ్రికా) వంటి క్రికెటర్లు హాంకాంగ్ టోర్నీలో పాల్గొంటున్నారు.
ఐపీఎల్ వస్తోంది.. కానీ
దిల్లీ: ఐపీఎల్ సృష్టించే సందడిలో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయి తప్పు చేయొద్దని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమ్ఇండియాను హెచ్చరించాడు. ‘‘ఐపీఎల్ త్వరలోనే ప్రారంభంకానుంది. కానీ వన్డే సిరీస్ ఓటమిని మరిచిపోకూడదు. భారత్ కొన్నిసార్లు ఓటముల్ని మరిచిపోయి తప్పు చేస్తుంది. ఈసారి అలా జరగకూడదు. వన్డే ప్రపంచకప్లో మరోసారి ఆసీస్తో తలపడాల్సి రావొచ్చు. కంగారూల జట్టు ఒత్తిడి పెంచడం వల్ల మూడో వన్డేలో భారత్కు ఓటమి ఎదురైంది. 270 లేదా 300 పరుగుల లక్ష్యాలను ఛేదించాలంటే పెద్ద భాగస్వామ్యాలు నిర్మించడం అవసరం. కానీ అది జరగలేదు. బౌండరీలు గగనమయ్యాయి. సింగిల్స్ రాబట్టడం కూడా కష్టమైంది. అలా జరుగుతున్నప్పుడు అలవాటు లేని షాట్లు ఆడతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్తో కోల్కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?