ICC World Cup 2023: విండీస్ లేని వన్డే సంబరం
తొలి రెండు ప్రపంచకప్లు ఆ జట్టువే. మూడో పర్యాయం కూడా ఫైనల్ చేరింది. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న జట్టును ఈసారి ప్రపంచకప్లో చూడలేం.
తొలిసారి ప్రపంచకప్కు దూరం
స్కాట్లాండ్ చేతిలో ఓటమితో ఆశలు ఆవిరి
తొలి రెండు ప్రపంచకప్లు ఆ జట్టువే. మూడో పర్యాయం కూడా ఫైనల్ చేరింది. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న జట్టును ఈసారి ప్రపంచకప్లో చూడలేం. గతమెంతో ఘనమన్నట్లుగా.. నానాటికీ తీసికట్టుగా మారిన ఆటతో ఇప్పటికే అవమానాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది. ఒకప్పుడు అరివీర భయంకరమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన కరీబియన్ జట్టుకు ఇలాంటి దుస్థితి రావడం ముందుతరం క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే.
హరారె
ఊహించిందే జరిగింది. వెస్టిండీస్కు షాక్ తప్పలేదు. పేలవ ప్రదర్శనతో.. పస లేని ఆటతో పసికూనల చేతిలో ఓడుతున్న ఆ జట్టు.. ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది. శనివారం ప్రపంచకప్ క్వాలిఫయర్ సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో ఆ జట్టు దారులు మూసుకుపోయాయి. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన విండీస్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్ (45), రొమారియో షెఫర్డ్ (36) చెరో కొన్ని పరుగులు చేయకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ ఇద్దరు మినహా ఆ జట్టులో మరే బ్యాటర్ కూడా 22 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఇప్పుడే క్రికెట్లో ఓనమాలు దిద్దుతున్నట్లు.. అంతర్జాతీయ అనుభవమే లేదన్నట్లు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. మెక్ములెన్ (3/32), మార్క్ వాట్ (2/25), క్రిస్ గ్రేవ్స్ (2/30), క్రిస్ సోల్ (2/43) వికెట్లు పంచుకున్నారు. బ్యాటర్ల మార్గంలోనే సాగిన విండీస్ బౌలర్లు కూడా.. ఛేదనలో స్కాట్లాండ్ను కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), మెక్ములెన్ (69) అర్ధశతకాలతో రాణించడంతో స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇద్దరిని ఆపలేక విండీస్ బౌలర్లు చేష్టలుడిగారు. అంతకుముందు లీగ్ దశ చివరి రెండు మ్యాచ్ల్లో వరుసగా జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతుల్లో విండీస్ చిత్తయిన సంగతి తెలిసిందే. తనతో పాటు సూపర్-6కు అర్హత సాధించిన జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతుల్లో ఓడటంతో విండీస్ ఒక్క పాయింటూ లేకుండా సూపర్-6లో అడుగు పెట్టింది. దీంతో ఈ దశలో ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవడమే కాక.. జింబాబ్వే, శ్రీలంకల్లో ఒక జట్టు ఒకటికి మించి విజయాలు సాధించకపోతేనే విండీస్ ముందంజ వేసే పరిస్థితి తలెత్తింది. అయితే తొలి మ్యాచ్లోనే కరీబియన్ జట్టు చిత్తుగా ఓడటంతో మిగతా సమీకరణాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది.
వెస్టిండీస్: 183 (హోల్డర్ 45, రొమారియో షెఫర్డ్ 36; మెక్ములెన్ 3/32, మార్క్ వాట్ 2/25, క్రిస్ గ్రేవ్స్ 2/30, క్రిస్ సోల్ 2/43); స్కాట్లాండ్: 185/3 (మాథ్యూ క్రాస్ 74 నాటౌట్, మెక్ములెన్ 69; అకీల్ హొసీన్ 1/26)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.