Team India - BCCI: ఇది సరైన దారేనా..?
వెస్టిండీసే కదా! ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి పసికూనల చేతుల్లో ఓడి వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేదు కదా! అలాంటి జట్టు ఏం చేస్తుందిలే.. అని అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేసిన భారత్కు షాక్.
వెస్టిండీసే కదా! ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి పసికూనల చేతుల్లో ఓడి వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేదు కదా! అలాంటి జట్టు ఏం చేస్తుందిలే.. అని అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేసిన భారత్కు షాక్. రెండో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైన టీమ్ఇండియా.. కరీబియన్ జట్టు చేతిలో గట్టి దెబ్బ తింది.
వన్డే ప్రపంచకప్ మరెంతో దూరంలో లేదు. ఇలాంటి సమయంలో జట్టు ఆటతీరు.. వ్యూహాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. మెగా టోర్నీ దిశగా మన సన్నాహాలు సరైన దారిలోనే సాగుతున్నాయా అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా జట్టు యాజమాన్యం పొరపాట్ల నుంచి పాఠాలు నేరుస్తుందా? ప్రపంచకప్ ముందు జట్టును పటిష్ఠపరుస్తుందా?
ఈనాడు క్రీడావిభాగం
వెస్టిండీస్తో వన్డే సిరీస్ అనగానే.. భారత ఆటగాళ్లంతా బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగి ప్రపంచకప్కు ముందు మంచి ఊపులోకి వస్తారనే అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు చూస్తే ప్రయోగాల పేరుతో ప్రదర్శన వెనక్కి వెళ్తోంది. తొలి రెండు వన్డేల్లో ఇషాన్ కిషన్ అర్ధశతకాలు మినహా చెప్పుకోదగింది ఏం లేదు. తొలి వన్డేలో రోహిత్, కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వెళ్లి.. ఇతర ఆటగాళ్లను పరీక్షించి చూశారు. కానీ 115 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు జట్టు ఆపసోపాలు పడింది. చివరకు 5 వికెట్లు కోల్పోయి గెలిచింది. ఇక విశ్రాంతి పేరుతో రోహిత్, కోహ్లి దూరంగా ఉన్న రెండో వన్డేలో అయితే ప్రదర్శన మరింత దిగజారింది. ఈసారి బ్యాటింగ్లోనే కాక బౌలింగ్లోనూ జట్టు విఫలమైంది. 90 పరుగుల వరకూ ఒక్క వికెట్టూ కోల్పోని టీమ్ఇండియా.. ఆ తర్వాత 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లూ చేజార్చుకోవడం బ్యాటింగ్ డొల్లతనాన్ని బయటపెట్టింది. జట్టులో మరీ కొత్త ఆటగాళ్లున్నారా? పోనీ అంతర్జాతీయ అనుభవం లేదా? అంటే అదేమీ కాదు. ప్రపంచకప్ జట్టు ఎంపికకు పరిగణించే అవకాశాలున్న శాంసన్ (9), అక్షర్ (1), హార్దిక్ (7), సూర్యకుమార్ (24), జడేజా (10) తేలిపోయారు. మనవాళ్లు చేతులెత్తేసిన అదే పిచ్పై విండీస్ బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఒక్క శార్దూల్ (3/42) మినహా బౌలర్లు రాణించకపోవడంతో విండీస్ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్ (63 నాటౌట్), కార్టీ (48 నాటౌట్), మేయర్స్ (36) మెరిశారు. దీంతో 2019 డిసెంబర్ తర్వాత టీమ్ఇండియాపై విండీస్ తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 1-1తో సిరీస్ సమమై.. నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆసక్తి పెరిగింది.
2021లోనూ ఇలాగే..
ఈ ఏడాది భారత్లోనే అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతుంది. ఆ మెగా టోర్నీకి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఇలాంటప్పుడు జట్టులో ప్రయోగాలు అవసరమా? సాధారణంగా ఏ ప్రపంచకప్కైనా జట్లు రెండు లేదా మూడేళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతాయి. ముందుగా ఓ రెండేళ్ల పాటు జట్టులో ప్రయోగాలు చేసి, తుది కూర్పును తయారు చేసుకుంటాయి. ప్రపంచకప్కు ఏడాది ముందు నుంచి నిలకడగా ఒకే జట్టును ఆడిస్తాయి. కానీ భారత్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2021 టీ20 ప్రపంచకప్కు ముందు కూడా ఇలాగే జరిగింది. అప్పుడైతే ఏ మ్యాచ్లో ఏ ఆటగాణ్ని ఎందుకు ఆడించారో కూడా తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేశారు. ఫలితం బెడిసికొట్టింది. పొట్టి కప్పులో అత్యుత్తమ జట్టును బరిలో దింపలేక.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతే కాకుండా ప్రపంచకప్ (వన్డే, టీ20) చరిత్రలో తొలిసారి దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడింది. ఇంత జరిగినా టీమ్ఇండియా మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకున్నట్లు లేదు. నిరుడు టీ20 ప్రపంచకప్లోనూ నిరాశే మిగిలింది. ఇప్పుడు కీలకమైన వన్డే ప్రపంచకప్కు ముందూ ఇలాగే ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలు శ్రుతి మించితే మరోసారి.. అదీ సొంతగడ్డపై పరాభవం తప్పదు.
సొంతగడ్డపై అనుకుంటే..
ఇప్పుడు ఆడుతోంది విదేశాల్లో కాబట్టి ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి.. ప్రపంచకప్ సొంతగడ్డపై కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు అనుకుంటే పొరపడ్డట్టే! స్వదేశంలో జరిగే మెగా టోర్నీలో అంచనాలు అసాధారణ స్థాయిలో ఉంటాయి. ఈ టోర్నీలో ఇలాంటి ఒక్క మ్యాచ్ ఎదురై.. జట్టు ఓటమి పాలైతే పుంజుకోవడం కష్టమవుతుంది. కప్పు గెలవాలంటే ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. ఆ దిశగా ఎలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా.. పూర్తి అత్యుత్తమ జట్టును బరిలో దింపాల్సి ఉంటుంది. ఏ స్థానంలో ఏ ఆటగాడు ఆడాలి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి. ఓపెనింగ్ చేసేది ఎవరు? మిడిలార్డర్లో నిలబడేది ఎవరు? పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకునేది ఎవరు? స్పిన్తో చుట్టేసేది ఎవరు.. ఇలా ఇప్పటికే తుది జట్టుపై స్పష్టత రావాల్సింది పోయి ప్రయోగాల పుణ్యమా అని మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచకప్కు ముందు భారత్ ఆసియా కప్లో 6 (ఫైనల్ చేరితే), ఆస్ట్రేలియాతో 3 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూ పోతే.. ప్రపంచకప్లో ఆడించే జట్టులో ఆటగాళ్ల స్థానాలపై స్పష్టత ఎలా వస్తుందన్నది మేనేజ్మెంట్కే తెలియాలి. నిర్దిష్టమైన స్థానాల్లో ఆటగాళ్లను నిలకడగా ఆడిస్తే.. అప్పుడు తుది కూర్పుపై ఓ అంచనా ఏర్పడే ఆస్కారముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్