కప్పు ముందు కంగారూలతో..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్! వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది?
ఆసీస్తో భారత్ తొలి వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్! వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సరిచూసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్నెస్పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే మంచి సిరీస్ లభిస్తుందా? టీమ్ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుంటుందో? నేటి నుంచే ఆస్ట్రేలియాతో సిరీస్.
మొహాలి
స్వదేశంలో వన్డే ప్రపంచకప్కు ముందు టీమ్ఇండియా అసలైన సవాల్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యలకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. రోహిత్ గైర్హాజరీలో వికెట్కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం టీమ్ఇండియాకు పెద్ద సవాలే. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో ఓడినప్పటికీ కమిన్స్ సారథ్యంలోని కంగారూ జట్టు మంచి ఫామ్లో ఉంది.
శ్రేయస్పైనే దృష్టి: ఫిట్నెస్తో ఉన్నాడా? ప్రపంచకప్లో ఆడగలడా? శ్రేయస్ అయ్యర్ గురించి అందరిలోనూ ఉన్న అనుమానాలివి. ఈ నేపథ్యంలో అభిమానులందరి దృష్టీ అతడిపైనే నిలవనుంది. 28 ఏళ్ల శ్రేయస్ వెన్ను గాయం కారణంగా గత ఆరు నెలల్లో పెద్దగా క్రికెట్ ఆడలేదు. పునరాగమనం చేసినా.. ఆసియాకప్లో మళ్లీ వెన్ను సమస్యతో ఇబ్బందిపడ్డాడు. కేవలం రెండే మ్యాచ్లు ఆడి మిగతా మ్యాచ్లకు దూరం కావడంతో అతడి ఫిట్నెస్పై సందేహాలు వ్యక్తమయ్యాయి. శ్రేయస్ ఇప్పుడు బాగానే ఉన్నాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. కానీ అతడు ఎంత ఫిట్గా ఉన్నాడన్నది ఈ సిరీస్తో తేలిపోనుంది. శ్రేయస్ను అందరూ నిశితంగా పరిశీలిస్తారనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి. శ్రేయస్ తర్వాత మరో ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కే ఈ సిరీస్ పెద్ద పరీక్ష. ప్రపంచకప్కు ఎంపికైనప్పటికీ ఈ టీ20 స్టార్ వన్డే సామర్థ్యంపై సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ కాలంలో 27 వన్డేల్లో 25 లోపు సగటు అంటే చాలా తక్కువే. ఇది అతడి ప్రతిభను కానీ, సామర్థ్యాన్ని కానీ ఏమాత్రం ప్రతిబింబించట్లేదు. అతడు ప్రపంచకప్లో తుది జట్టులో స్థానానికి గ్యారెంటీ ఉన్న ఆటగాడు కాదు. కానీ తనను తాను నిరూపించుకోడానికి, ప్రపంచకప్కు తన ఎంపిక సరైందేనని చాటుకోవడానికి సూర్యకు ఈ సిరీస్ చక్కని అవకాశం. టోర్నీకి ముందు అతడు సూపర్ఫామ్ను అందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గిల్, రాహుల్, ఇషాన్ కిషన్ ఫామ్లో ఉండడంతో భారత్ బ్యాటింగ్లో బలంగానే కనిపిస్తోంది. గిల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అక్షర్ గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన 37 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు. వార్నర్, స్మిత్లతో అతడి పోరు అభిమానులను అలరించనుంది. ఒకవేళ అక్షర్ కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుల్దీప్, హార్దిక్లు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో అశ్విన్తో పాటు వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉంటాడు. వీళ్లిద్దరూ జడేజాతో కలిసి స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఫాస్ట్బౌలర్లెవరికీ విశ్రాంతిన్వివలేదు. కానీ బుమ్రా, సిరాజ్లు మూడు మ్యాచ్ల్లో రెండే ఆడే అవకాశముంది.
ఫామ్లో ఆసీస్: ఇటీవల దక్షిణాఫ్రికాలో 2-3తో ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా నాణ్యమైన వన్డే సిరీస్ ఆడింది. భారత్తో భారత్లో ఆడిన చివరి వన్డే సిరీస్లో నెగ్గడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచేదే. ట్రావిస్ హెడ్కు గాయం కావడంతో అందివచ్చిన అవకాశాన్ని లబుషేన్ దక్షిణాఫ్రికాతో సిరీస్లో అందిపుచ్చుకున్నాడు. అతడు 283 పరుగులతో ఆ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అసలు పరీక్ష మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకే. బ్యాటింగ్ అనుకూల పిచ్పై బౌలింగ్ చేయడం వారికి సవాలే. కెప్టెన్ కమిన్స్ గాయం ఆసీస్కు ఆందోళన కలిగిస్తోంది. మణికట్టు గాయం నుంచి కోలుకున్న అతడు సిరీస్లో మూడు మ్యాచ్లూ అడతాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
తుది జట్లు (అంచనా).. భారత్: ఇషాన్ కిషన్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, రాహుల్, జడేజా, సుందర్, అశ్విన్, షమి, సిరాజ్, బుమ్రా
ఆస్ట్రేలియా: వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, కేరీ, గ్రీన్, స్టాయినిస్, కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్వుడ్
పిచ్ ఇలా
మొహాలీలో నాలుగేళ్లుగా వన్డే మ్యాచ్ జరగలేదు. ఐపీఎల్లో మాత్రం కొన్ని భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా ఇక్కడ 2019లో జరిగిన మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి వన్డే సందర్భంగా ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.
వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి స్టీవ్ స్మిత్కు అవసరమైన పరుగులు. 61
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం