కప్పు ముందు కంగారూలతో..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్! వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది?
ఆసీస్తో భారత్ తొలి వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్! వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సరిచూసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్నెస్పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే మంచి సిరీస్ లభిస్తుందా? టీమ్ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుంటుందో? నేటి నుంచే ఆస్ట్రేలియాతో సిరీస్.
మొహాలి
స్వదేశంలో వన్డే ప్రపంచకప్కు ముందు టీమ్ఇండియా అసలైన సవాల్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యలకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. రోహిత్ గైర్హాజరీలో వికెట్కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం టీమ్ఇండియాకు పెద్ద సవాలే. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో ఓడినప్పటికీ కమిన్స్ సారథ్యంలోని కంగారూ జట్టు మంచి ఫామ్లో ఉంది.
శ్రేయస్పైనే దృష్టి: ఫిట్నెస్తో ఉన్నాడా? ప్రపంచకప్లో ఆడగలడా? శ్రేయస్ అయ్యర్ గురించి అందరిలోనూ ఉన్న అనుమానాలివి. ఈ నేపథ్యంలో అభిమానులందరి దృష్టీ అతడిపైనే నిలవనుంది. 28 ఏళ్ల శ్రేయస్ వెన్ను గాయం కారణంగా గత ఆరు నెలల్లో పెద్దగా క్రికెట్ ఆడలేదు. పునరాగమనం చేసినా.. ఆసియాకప్లో మళ్లీ వెన్ను సమస్యతో ఇబ్బందిపడ్డాడు. కేవలం రెండే మ్యాచ్లు ఆడి మిగతా మ్యాచ్లకు దూరం కావడంతో అతడి ఫిట్నెస్పై సందేహాలు వ్యక్తమయ్యాయి. శ్రేయస్ ఇప్పుడు బాగానే ఉన్నాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. కానీ అతడు ఎంత ఫిట్గా ఉన్నాడన్నది ఈ సిరీస్తో తేలిపోనుంది. శ్రేయస్ను అందరూ నిశితంగా పరిశీలిస్తారనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి. శ్రేయస్ తర్వాత మరో ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కే ఈ సిరీస్ పెద్ద పరీక్ష. ప్రపంచకప్కు ఎంపికైనప్పటికీ ఈ టీ20 స్టార్ వన్డే సామర్థ్యంపై సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ కాలంలో 27 వన్డేల్లో 25 లోపు సగటు అంటే చాలా తక్కువే. ఇది అతడి ప్రతిభను కానీ, సామర్థ్యాన్ని కానీ ఏమాత్రం ప్రతిబింబించట్లేదు. అతడు ప్రపంచకప్లో తుది జట్టులో స్థానానికి గ్యారెంటీ ఉన్న ఆటగాడు కాదు. కానీ తనను తాను నిరూపించుకోడానికి, ప్రపంచకప్కు తన ఎంపిక సరైందేనని చాటుకోవడానికి సూర్యకు ఈ సిరీస్ చక్కని అవకాశం. టోర్నీకి ముందు అతడు సూపర్ఫామ్ను అందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గిల్, రాహుల్, ఇషాన్ కిషన్ ఫామ్లో ఉండడంతో భారత్ బ్యాటింగ్లో బలంగానే కనిపిస్తోంది. గిల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అక్షర్ గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన 37 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు. వార్నర్, స్మిత్లతో అతడి పోరు అభిమానులను అలరించనుంది. ఒకవేళ అక్షర్ కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుల్దీప్, హార్దిక్లు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో అశ్విన్తో పాటు వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉంటాడు. వీళ్లిద్దరూ జడేజాతో కలిసి స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఫాస్ట్బౌలర్లెవరికీ విశ్రాంతిన్వివలేదు. కానీ బుమ్రా, సిరాజ్లు మూడు మ్యాచ్ల్లో రెండే ఆడే అవకాశముంది.
ఫామ్లో ఆసీస్: ఇటీవల దక్షిణాఫ్రికాలో 2-3తో ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా నాణ్యమైన వన్డే సిరీస్ ఆడింది. భారత్తో భారత్లో ఆడిన చివరి వన్డే సిరీస్లో నెగ్గడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచేదే. ట్రావిస్ హెడ్కు గాయం కావడంతో అందివచ్చిన అవకాశాన్ని లబుషేన్ దక్షిణాఫ్రికాతో సిరీస్లో అందిపుచ్చుకున్నాడు. అతడు 283 పరుగులతో ఆ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అసలు పరీక్ష మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకే. బ్యాటింగ్ అనుకూల పిచ్పై బౌలింగ్ చేయడం వారికి సవాలే. కెప్టెన్ కమిన్స్ గాయం ఆసీస్కు ఆందోళన కలిగిస్తోంది. మణికట్టు గాయం నుంచి కోలుకున్న అతడు సిరీస్లో మూడు మ్యాచ్లూ అడతాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
తుది జట్లు (అంచనా).. భారత్: ఇషాన్ కిషన్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, రాహుల్, జడేజా, సుందర్, అశ్విన్, షమి, సిరాజ్, బుమ్రా
ఆస్ట్రేలియా: వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, కేరీ, గ్రీన్, స్టాయినిస్, కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్వుడ్
పిచ్ ఇలా
మొహాలీలో నాలుగేళ్లుగా వన్డే మ్యాచ్ జరగలేదు. ఐపీఎల్లో మాత్రం కొన్ని భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా ఇక్కడ 2019లో జరిగిన మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి వన్డే సందర్భంగా ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.
వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి స్టీవ్ స్మిత్కు అవసరమైన పరుగులు. 61
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs AUS: మ్యాక్స్వెల్ ముంచేశాడు
ప్చ్.. పొట్టి సిరీస్లో భారత్కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్వెల్ విధ్వంసక బ్యాటింగ్తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ruturaj gaikwad: అదే రోజు.. అదే బాదుడు
నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్ప్రదేశ్పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్లు, 10 ఫోర్లు ఉన్నాయి. -
మ్యాచ్లో ఓ మలుపు
వికెట్కీపర్ ఇషాన్కిషన్ చేసిన ఓ తప్పిదం ఆసీస్కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు. -
ముకేశ్కు పెళ్లి కళ
భారత పేసర్ ముకేశ్ కుమార్ పెళ్లి కొడుకయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఆడని అతడు గోరఖ్పుర్లో తన వివాహ వేడుక కోసం బీసీసీఐ అనుమతి తీసుకుని వెళ్లాడు. -
టీ20 ప్రపంచకప్కు నమీబియా
2024 టీ20 ప్రపంచకప్కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరఫున పొట్టి కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియాపై విజయం సాధించింది. -
Jasprit Bumrah: బుమ్రా ‘మౌనం’ ఎందుకు?
బుమ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. -
ఆసీస్ జట్టులో అనేక మార్పులు
భారత్తో టీ20 సిరీస్లో ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టులో అనేక మార్పులు జరిగాయి. చివరి రెండు మ్యాచ్లకు ముందు దాదాపు సగం ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోనుంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ మాత్రమే మిగిలిన రెండు టీ20ల కోసం భారత్లో ఉంటాడు. -
రాణించిన హసన్జాయ్
హసన్జాయ్ (86; 166 బంతుల్లో 11×4) రాణించడంతో న్యూజిలాండ్తో తొలి టెస్టులో బంగ్లా మొదటిరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్లో 310/9 స్కోరు చేసింది. తైజుల్ (8), షోరిఫుల్ (13) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను హసన్ జాయ్ నడిపించాడు. -
అమ్మాయిలకు పరీక్ష
భారత మహిళల ‘ఏ’ జట్టుకు పరీక్ష. బుధవారం ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. మిన్ను మణి సారథ్యంలోని టీమ్ఇండియాలో ప్రతిభావంతులకు కొదువ లేదు. తెలుగమ్మాయిలు జి.త్రిష, బారెడ్డి అనూషలకు సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశం. -
త్వరలోనే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు
-
అదనపు పరిహారానికి పీసీబీ డిమాండ్
తమకు అదనపు పరిహారం చెల్లించాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)ను పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఆసియా కప్ సమయంలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు గాను అదనపు పరిహారం ఇవ్వాలని కోరుతోంది. -
ఐపీఎల్ ఆడాలని ఉంది
ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి ఆటగాడు ఐపీఎల్కు రావాలని అనుకుంటారు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది పెద్ద లీగ్. భవిష్యత్లో అవకాశం వస్తే కచ్చితంగా ఆడతా’’ అని హసన్ అలీ చెప్పాడు. -
కోచ్గా ద్రవిడే..!
టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? -
Kapil Dev: ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు
ఎక్కువ ఆశలు పెట్టుకోవడం చేటు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. అభిమానులు అధిక ఒత్తిడి తెచ్చుకోవద్దని.. క్రికెట్ను ఒక క్రీడగా మాత్రమే పరిగణించాలని సూచించాడు. ‘‘ఎక్కువ ఆశలు పెట్టుకుంటే హృదయాలు ముక్కలవుతాయి. -
శీతల్ నం.1
రెండు చేతులు లేకపోయినా కాళ్ల సాయంతో విల్లును పట్టుకుని గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తున్న భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనత సాధించింది. మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో ఆమె రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నంబర్వన్గా నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి తుపాను ముప్పు
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్