IND v ENG: ఇంగ్లాండ్ అదే వ్యూహంతో..
పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. దూకుడు మంత్రంతో, బజ్బాల్ ఆటతీరుతో ఇంగ్లాండ్ సాగిపోతోంది. ఓటములు ఎదురైనా.. విమర్శలు వస్తున్నా.. తగ్గేదేలేదంటోంది.
పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. దూకుడు మంత్రంతో, బజ్బాల్ ఆటతీరుతో ఇంగ్లాండ్ సాగిపోతోంది. ఓటములు ఎదురైనా.. విమర్శలు వస్తున్నా.. తగ్గేదేలేదంటోంది. టెస్టులకు వేగాన్ని జోడించి.. సుదీర్ఘ ఫార్మాట్ను సరికొత్తగా మారుస్తోంది. ఇప్పుడా జట్టు భారత్లో అడుగుపెట్టింది. టీమ్ఇండియాతో అయిదు టెస్టుల సమరానికి సై అంటోంది. కానీ రోహిత్ సేనతో పోరులో భారత్లోని స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ బజ్బాల్ వ్యూహం ఫలిస్తుందా? మన జట్టు ముందు ఇంగ్లిష్ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతుందా?
ఈనాడు క్రీడావిభాగం
భారత్, ఇంగ్లాండ్ (IND v ENG) మధ్య అయిదు టెస్టుల సిరీస్కు సమయం ఆసన్నమవుతోంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ మొదలెట్టాయి. భారత్లో మరోసారి సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరగా ఓడింది ఇంగ్లాండ్ చేతిలోనే కావడం గమనార్హం. 2012లో నాలుగు టెస్టుల సిరీస్ను 1-2తో కోల్పోయింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్ మరో టెస్టు సిరీస్ ఓడిపోలేదు. ప్రత్యర్థికి సిరీస్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీస్లు గెలిచింది. 46 టెస్టుల్లో 36 నెగ్గింది. మూడు మాత్రమే ఓడింది. ఏడు డ్రా చేసుకుంది. 2016లో 4-0తో, 2021లో 3-1తో ఇంగ్లాండ్నూ చిత్తుచేసింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్తో పోరుకు రంగం సిద్ధమైంది.
విజయం కోసం: భారత్లో మరో టెస్టు సిరీస్ విజయం కోసం ఇంగ్లాండ్ పరితపిస్తోంది. ఇక్కడ 15 టెస్టు సిరీస్ (1980లో జరిగిన ఏకైక టెస్టును మినహాయిస్తే)లు ఆడిన ఇంగ్లాండ్ నాలుగింట్లో గెలిచింది. మూడు డ్రా చేసుకుంది. 8 సిరీస్ల్లో ఓడింది. భారత్లో టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్లు డగ్లస్ జార్డిన్, టోనీ గ్రెయిగ్, డేవిడ్ గోవర్, కుక్ సరసన నిలవాలనే పట్టుదలతో ఇప్పుడు స్టోక్స్ ఉన్నాడు. కోచ్ మెక్కలమ్తో కలిసి అతను ఇంగ్లాండ్ టెస్టులాడే విధానాన్నే పూర్తిగా మార్చేశాడు. బజ్బాల్ ఆటతో ఇంగ్లాండ్ దూకుడు అందుకుంది. పూర్తిస్థాయి కెప్టెన్గా స్టోక్స్ 18 టెస్టుల్లో 13 విజయాలు అందుకున్నాడు. గత 18 నెలలుగా ఆ జట్టు టెస్టుల్లో సగటున ఓవర్కు 4.8 పరుగుల చొప్పున సాధించింది. భారత్తో సిరీస్ ముంగిట వార్మప్ మ్యాచ్లు ఆడకుండా.. అబుదాబిలో 11 రోజుల శిక్షణ శిబిరంలో ఆ జట్టు పాల్గొంది. ఇక్కడి స్పిన్ పిచ్లకు తగ్గట్లుగా సిద్ధమైంది. పైగా నిరుడు పాకిస్థాన్లో టెస్టు సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో స్పిన్ పరిస్థితుల్లో సమర్థంగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు అడుగుపెట్టింది.
స్పిన్కు సిద్ధమై..: బ్యాటర్లు బెయిర్స్టో, క్రాలీ, డకెట్, ఫోక్స్, లారెన్స్, పోప్, రూట్, స్టోక్స్.. పేసర్లు అండర్సన్, అట్కిన్సన్, రాబిన్సన్, మార్క్ వుడ్.. స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్లతో ఇంగ్లాండ్ బలంగానే ఉంది. సీనియర్ బ్యాటర్ రూట్కు భారత్లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ 10 టెస్టుల్లో 50.10 సగటుతో 952 పరుగులు చేశాడు. అతను స్పిన్తోనూ జట్టుకు సహాయపడగలడు. ఇక్కడ 8 వికెట్లూ పడగొట్టాడు. ఓవరాల్గా భారత్పై 30 టెస్టు ఇన్నింగ్స్ల్లో స్టోక్స్ 773 పరుగులు చేయడంతో పాటు 39 వికెట్లు పడగొట్టాడు. కానీ మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను ఈ సిరీస్లో బౌలింగ్ చేయడం కష్టమే. మరోవైపు బ్యాటింగ్లో బెయిర్స్టో ప్రమాదకరమే. క్రాలీ, డకెట్, పోప్ కూడా క్రీజులో కుదురుకుంటే పరుగులు సాధించగలరు. బౌలింగ్లో అండర్సన్, అట్కిన్సన్, రాబిన్సన్, మార్క్వుడ్ రూపంలో నాణ్యమైన పేసర్లున్నారు. వయసు మీదపడుతున్నా వన్నె తగ్గని పేస్తో అండర్సన్ దూసుకెళ్తున్నాడు. భారత్లో ఆడిన 13 టెస్టుల్లో అతను 34 వికెట్లు పడగొట్టాడు. 700 టెస్టు వికెట్లకు మరో 10 వికెట్ల దూరంలో ఉన్న 41 ఏళ్ల అండర్సన్పై అందరి దృష్టి నిలవనుంది. ఇక్కడి స్పిన్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నలుగురు స్పిన్నర్లను ఇంగ్లాండ్ ఎంపిక చేసింది. కానీ అనుభవలేమి స్పష్టం. టామ్ హార్ట్లీ ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు. 20 ఏళ్ల షోయబ్ బషీర్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోనే అడుగుపెట్టలేదు. గాయం నుంచి కోలుకున్న జాక్ లీచ్ 35 టెస్టులాడగా.. 19 ఏళ్ల రెహాన్ అహ్మద్ ఆడింది ఒకటే టెస్టు. మరి ఈ స్పిన్ దళంతో ఇంగ్లాండ్ ఏమేర పోటీనిస్తుందో చూడాలి.
22
స్వదేశంలో ఇంగ్లాండ్తో ఆడిన 64 టెస్టుల్లో భారత్ విజయాలు. 14 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. 28 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
ఇప్పటివరకూ భారత్లో 15 టెస్టు సిరీస్లు ఆడిన ఇంగ్లాండ్.. నాలుగు సార్లు (1933-34, 1976-77, 1984-85, 2012) గెలిచింది. మూడు సిరీస్ల (1951-52, 1964, 2006)ను డ్రా చేసుకుంది. భారత్ 8 సిరీస్లు నెగ్గింది. ఇవి కాకుండా 1980లో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్