Bhajji : రాజకీయాలు తెలియవు.. క్రికెట్తోనే నా అనుబంధం: హర్భజన్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ ...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్పై స్పష్టత ఇచ్చాడు. రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్తో సంబంధమున్న వ్యవహారాల్లోనే పాల్గొనబోతున్నట్లు వెల్లడించాడు. వ్యాఖ్యాతగా మారడమా.. మెంటార్ వంటి పాత్ర పోషించడమా అనేది త్వరలోనే చెబుతానని, అయితే రాజకీయాల్లోకి రావడం లేదని పేర్కొన్నాడు. ‘‘భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తూనే ఉన్నా. ఏదైనా సరే ఆటతో ముడిపడి ఉండాలని భావిస్తున్నా. క్రికెట్ కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నా. అది క్రికెట్ వ్యాఖ్యాతగానా? లేదా ఐపీఎల్లో ఏదొక జట్టుకు మెంటార్గానా అనేది ఇప్పుడే చెప్పలేను. క్రికెట్ ఆటతో కనెక్ట్ అయ్యేందుకే ఇష్టపడతా. రాజకీయాలు మాత్రం కాదు’’ అని తెలిపాడు.
హర్భజన్ సింగ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2016లో ఆడాడు. అప్పటి నుంచి వేచి చూసినా జట్టులో స్థానం దక్కలేదు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం ఆలస్యం కావడంపై హర్భజన్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టులోకి వచ్చేందుకు ద్వారాలు మూసుకుపోయాయి. నేను చివరి మ్యాచ్ ఆడి కూడా ఐదేళ్లు అయింది. అప్పుడే నా మనస్సుల్లో రిటైర్మెంట్ అయిపోయానని అనుకున్నా. వీడ్కోలు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమైంది. ఇప్పుడు నేను మాజీ ఆటగాడిని. ఇప్పటివరకు జరిగిన విషయాలపై సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా’’ అని వివరించాడు.
మూడో టెస్టు మ్యాచ్లో విజయం ఎవరిదంటే..?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఖరి మ్యాచ్లో టీమ్ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయని హర్భజన్ తెలిపాడు. ‘‘గతంలో మనం పర్యటించినా.. ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చినా ఎప్పుడూ 145 కి.మీ వేగంతో బంతులను సంధించే నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు కాదు. అయితే ఇప్పుడు జట్టులో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. షమీ, బుమ్రా, సిరాజ్, శార్దూల్ వంటి నాణ్యమైన పేసర్లు ఉండటం కలిసొచ్చే అంశం. ఇలాంటి బౌలింగ్ దళం ఉండి ఉంటే దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయం ఎప్పుడో వచ్చేది. అందుకే ఈసారి భారత్కు మంచి అవకాశం ఉందని భావిస్తున్నా. ఇదే సమయంలో సఫారీల జట్టు కూడా బాగానే ఆడుతోంది. అయితే కేప్టౌన్లో టీమ్ఇండియా విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంటుంది’’ అని విశ్లేషించాడు. గతంలో దక్షిణాఫ్రికా జట్టు చాలా పటిష్ఠంగా ఉండేదని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఉన్న టీమ్ను తక్కువ చేయడం లేదుగానీ భారత్ను ఎదుర్కొనే సత్తా తక్కువేనని హర్భజన్ అంచనా వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత