
Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. వీరిద్దరిలో టీమ్ఇండియాను నడిపించేదెవరో?
ఇంటర్నెట్ డెస్క్: మే 29తో టీ20 లీగ్ ముగియనుంది. జూన్ 9 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సహా పలువురు సీనియర్లు అందుబాటులో ఉండరు. బయోబబుల్ ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు. జులైలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో రోహిత్, రాహుల్, కోహ్లీ, బుమ్రా, పంత్కు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్కు టీమ్ఇండియాను మరో సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యలో ఒకరు నడిపిస్తారని సమాచారం. ఇప్పటికే టీ20 లీగ్లో హార్దిక్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్ను ప్లేఆఫ్స్కు చేర్చాడు. దీంతో హార్దిక్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జూన్ 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. దిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్కోట్, బెంగళూరు వేదికగా మ్యాచ్లు జరుగుతాయి. దీని కోసం మే 22న టీమ్ఇండియా జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ‘‘సీనియర్ ప్లేయర్లు అందరూ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. రోహిత్, కేఎల్ రాహుల్, రిషభ్, బుమ్రా, కోహ్లీ తదితరులు నేరుగా ఇంగ్లాండ్కు వెళ్తారు. ఇంగ్లాండ్తో భారత్ ఐదో టెస్టుతోపాటు వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. అందుకే కీలకమైన ఆటగాళ్లు ఇంగ్లాండ్తో సిరీస్కు ఫ్రెష్గా ఉండాలని విశ్రాంతి ఇస్తున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్కు టీమ్ఇండియాను ఎవరు నడిపిస్తారనేదానిపైనా స్పందించారు. ‘‘సెలక్టర్లకు రెండు ఛాయిస్లు ఉన్నాయి. గతంలో విరాట్, రోహిత్, రాహుల్ గైర్హాజరీలో శ్రీలంక పర్యటనకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించాడు. అలానే హార్దిక్ పాండ్య సారథ్యం కూడా ఆకట్టుకుంటోంది’’ అని పేర్కొన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్ రెక్కలు..!
-
Politics News
Maharashtra: ఒక్కో ఎమ్మెల్యే రూ.50కోట్లకు అమ్ముడుపోయారు..
-
General News
అశ్వారావుపేటలో ఉద్రిక్తత.. రణరంగంగా మారిన గిరిజనల ‘ప్రగతిభవన్కు పాదయాత్ర’
-
Movies News
Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
-
Sports News
Hardik Pandya: టీమ్ఇండియా టీ20 సారథిగా హార్దిక్ కొత్త రికార్డు
-
Movies News
Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- చెరువు చేనైంది
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Agnipath: అగ్నిపథ్కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన