Hardik Pandya: ఐర్లాండ్తో ఆడుతున్నామని చెప్పడం తేలికే.. అయినా.. : హార్దిక్
క్రికెట్లో పసికూనగా పేరున్న ఐర్లాండ్తో ఆడుతున్నామని చెప్పడం తేలికే అయినా టీమ్ఇండియా తరఫున ఆడటం పెద్ద గర్వకారణమని కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో పసికూనగా పేరున్న ఐర్లాండ్తో ఆడుతున్నామని చెప్పడం తేలికే అయినా టీమ్ఇండియా తరఫున ఆడటం పెద్ద గర్వకారణమని కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్కు అతడు తొలిసారి టీమ్ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఈరోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్ మాట్లాడాడు.
‘ఈ సిరీస్ మాకు మానసిక సవాలులాంటిది. మేం ఐర్లాండ్తో ఆడుతున్నామని చెప్పడం తేలికైన విషయమే అయినా భారత జట్టు తరఫున ఆడటం అతిపెద్ద గర్వకారణం. అలాగే మేం ఈసారి ప్రపంచకప్ గెలవాలంటే ఇక్కడి నుంచి ఆడే ప్రతిఆట ముఖ్యమైనదే. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ అయినా.. మరే ఇతర పెద్ద సిరీస్ అయినా మేం ఒకే ఇంటెన్సిటీతో ఆడతాం. అలాంటిది.. ఇప్పుడు కూడా ఎంత బాగా ఆడతామన్నదే మానసికంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే రెండు మ్యాచ్ల్లో గెలవడం అంత తేలిక కాదు. కానీ, టీమ్ఇండియాకు ఆడుతున్నాం కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అది తప్పకుండా చేస్తాం’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఈ సిరీస్లో ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా యువ ఆటగాళ్లతో కలిసి ఆడటంపై స్పందించిన అతడు.. ఇలాంటి అవకాశం అదృష్టమని చెప్పాడు. టీమ్ఇండియా ఒకేసారి రెండు జట్లను ఆడించాల్సి వస్తే.. తమ రిజర్వ్ బెంచ్ అంత బలంగా ఉండటం అదృష్టమని చెప్పాడు. దీంతో చాలా మంది యువ క్రికెటర్లకు బరిలోకి దిగి తమ సత్తా చాటే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్లో అవకాశాలు రాని ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, అలాంటి వారికి టీమ్ఇండియా తరఫున ఆడటం పెద్ద కల అని హార్దిక్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో సీఐ కుమారుడి ‘సెల్’చల్
-
AP News: ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ
-
ఆత్మ.. ఆస్తి రాసిచ్చిందట! నకిలీ పత్రాలతో స్థలం కొట్టేసే యత్నం
-
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
-
ఆస్కార్కు గుర్తుగా సొంతూర్లో గ్రంథాలయం
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!