Ban vs NZ: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్
Ban vs NZ: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాన్స్టైకర్ బ్యాటర్ను రనౌట్చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఢాకా: బంతి వేయకముందే పరుగుకోసం సిద్ధమయ్యే నాన్స్టైకర్ బ్యాటర్ను ఔట్ చేయవచ్చా? లేదా? అన్నదానిపై ఇప్పటికే ఎన్నోసార్లు చర్చ జరిగింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కచ్చితంగా అది ఔటే. అయితే, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ రెండో వన్డే సందర్భంగా జరిగింది. నాన్స్టైకర్ ఎండ్లో ఉన్న ఇష్ సోథి (ish Sodhi) బంతి వేయకముందే పరుగు కోసం ప్రయత్నించడంతో బౌలర్ హసన్ మహ్మద్ (Hasan Mahmud) అతన్ని రనౌట్ చేశాడు. దీంతో ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్ (New Zealand) జట్టు బంగ్లాదేశ్ (Bangladesh)లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢాకా వేదికగా రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 45.3 ఓవర్లో బంతి విడుదల చేయకముందే ఇష్ సోథి పరుగు కోసం ప్రయత్నించగా, బౌలర్ హసన్ మహ్మద్ అతడిని రనౌట్ చేశాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు, మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు సైతం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. మహ్మద్ వెంటనే ఔట్ అప్పీల్ చేయగా, అంపైర్ అతడి వంక తీక్షణంగా చూసి, తుది నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు ఇచ్చాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో అప్పటికి 26 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి, జోరుమీదున్న ఇష్ సోథి చేసేది లేక చిరు నవ్వులు చిందిస్తూ పెవిలియన్ వైపు వెళ్లడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్దాస్తో చర్చించి, హసన్ మహ్మద్ తన అప్పీల్ను వెనక్కి తీసుకోవడంతో పాటు, సోథిని తిరిగి బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ క్రీజులోకి వచ్చిన సోథి నేరుగా వెళ్లి మహ్మద్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అవ్వడం గమనార్హం. దీంతో కివిస్ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇష్ సోథి 39 బంతుల్లో 35 పరుగులు చేయడమే కాదు, ఏకంగా ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మరోవైపు మ్యాచ్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన హసన్ మహ్మద్కు (Hasan Mahmud) సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.