Rohit-Virat: ఆ విషయాన్ని కోహ్లీ కెప్టెన్సీ నుంచి నేర్చుకున్నా: రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని, ఆ సమయంలో విరాట్ నుంచి పలు నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకున్నానని రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ .. సారథిగా అన్ని ఫార్మాట్లలో విజయవంతమవుతున్నాడు. ఇప్పటికే అతడి నాయకత్వంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీమ్ఇండియా.. టెస్టుల్లోనూ విజయాలు సాధిస్తోంది. తాజాగా రోహిత్ (Rohit Sharma) కెప్టెన్సీలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆసీస్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని, ఆ సమయంలో విరాట్ నుంచి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు.
‘నేను ఆటగాడిగా ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. ఆ సమయంలో నేను ఒక విషయం గమనించా. మనకు వికెట్ రాకపోయినా ఫర్వాలేదు. కానీ, ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. ఈ విషయాన్నివిరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు, మన బౌలర్ల నుంచి చూసి నేను నేర్చుకున్నా. అదే నేనెప్పుడు అమలు చేస్తున్నా. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేవాలి. ప్రతి బంతికి వికెట్ను ఆశించవద్దు. బంతిని సరైన ప్రాంతాలలో వేయాలి. అప్పుడు పిచ్ కూడా సహకరిస్తుంది’’ అని రోహిత్ శర్మ వివరించాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ఇండియా (Team India) ఎన్నో విజయాలు సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటతీరును కూడా అలవాటు చేసుకుంది. కోహ్లీ నాయకత్వంలోనే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కూ దూసుకెళ్లింది. రోహిత్ నాయకత్వంలోని టీమ్ఇండియాకు మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)కు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ మరో రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్కు దూసుకెళ్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.