IND vs ENG: హుషారుగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మరి రోహిత్‌ శర్మ ఎక్కడ?

ఒకవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్‌లో యువ భారత్‌  పోరాడుతుంటే.. మరో వైపు సీనియర్‌ ఆటగాళ్లు గురువారం ఇంగ్లాండ్‌ పయనమయ్యారు. గతేడాది అర్దాంతరంగా వాయిదా పడిన చివరి టెస్టు మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా

Published : 17 Jun 2022 02:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యువ భారత్‌  పోరాడుతుంటే.. మరో వైపు సీనియర్‌ ఆటగాళ్లు గురువారం ఇంగ్లాండ్‌ పయనమయ్యారు. గతేడాది అర్దాంతరంగా వాయిదా పడిన చివరి టెస్టు మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జులై 1 నుంచి  5 జరగనుంది. ఈ సిరీస్‌లో  భారత్‌ 2-1  ఆధిక్యంలో ఉంది.  ఇది ముగిశాక టీ20, వన్డే  సిరీస్‌లను అక్కడే ఆడనుంది. ఈ సందర్భంగా విరాట్‌కోహ్లీ, బుమ్రా, శుభమన్‌ గిల్‌, ఛెతెశ్వర్‌ పుజారా, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌‌, రవీంద్ర జడేజా  విమానంలో ఇంగ్లాండ్‌కు వెళుతున్న ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వీటిలో రోహిత్‌ శర్మ లేకపోవడంతో కెప్టెన్‌ ఎక్కడంటూ అభిమానులు కామెంట్స్‌ రూపంలో  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇరు జట్ల కెప్టెన్‌లు రోహిత్‌ శర్మ, బెన్‌ స్టోక్స్‌.. కోచ్‌లు ద్రవిడ్‌, మెక్‌కల్లమ్‌ కొత్తవారు కావడంతో అభిమానుల్లో ఈ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని