Shubman Gill: అహ్మదాబాద్కు గిల్ .. పాక్తో మ్యాచ్ ఆడతాడా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..?
ఇప్పుడందరి చూపూ శుభ్మన్ గిల్ (Shubman Gill)పైనే ఉంది. డెంగీ బారిన పడటంతో వన్డే ప్రపంచకప్లో రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక చిరకాల ప్రత్యర్థి పాక్తోనైనా ఆడతాడని ఆశిస్తున్న వేళ.. భారత బ్యాటింగ్ కోచ్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: డెంగీ బారిన పడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఇవాళ అఫ్గానిస్థాన్తో (IND vs AFG) మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. అయితే, పాకిస్థాన్తో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్లో గిల్ ఆడతాడనే కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చెన్నై నుంచి అహ్మదాబాద్కు వెళ్తాడనే ప్రచారం సాగింది. తాజాగా ఆ వార్తలపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా గిల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చాడు.
‘‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమే. ముందు జాగ్రత్తగా ఇలా చేశాం. కోలుకోవడంతో మళ్లీ హోటల్కు చేరుకున్నాడు. ఎప్పటికప్పుడు వైద్య బృందం పర్యవేక్షిస్తూ ఉంది. త్వరలోనే మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు కోలుకున్నాడు. అయితే, ఏ మ్యాచ్లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టం.
గిల్ అందుబాటులో లేకపోయినా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగానే ఉంది. అనుభవం కలిగిన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు. మైదానంలోకి దిగిన తర్వాత ఎలా ఆడాలనే స్వేచ్ఛ వారికి ఇచ్చాం. కాబట్టి కేవలం ఒక్కరి మీదనే టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడదు’’ అని రాఠోడ్ తెలిపాడు.
దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్తో భారత్ ఇవాళ తలపడనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం డెంగీ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకోని గిల్ పాక్తో మ్యాచ్కు సిద్ధం కావడం కష్టమేనన్న అభిప్రాయమూ విశ్లేషకుల్లో నెలకొంది. దీంతో ఓపెనర్గా ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..