IND vs ENG : అదరగొట్టిన మంధాన, రోడ్రిగ్స్‌.. ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 165

కామన్వెల్త్‌ కీలక పోరులో భారత ఓపెనర్‌ స్మృతీ మంధాన (61) దూకుడుగా ఆడేసింది. టాస్‌ నెగ్గిన టీమ్ఇండియా ..

Published : 06 Aug 2022 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ కీలక పోరులో భారత ఓపెనర్‌ స్మృతీ మంధాన 61 స్కోరుతో ప్రతిభ చూపింది. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడింది. టాస్‌ నెగ్గిన టీమ్ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ మంధానతో కలిసి షఫాలీ వర్మ (15) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించింది. వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌కౌర్ (20) ఫర్వాలేదనిపించింది. అయితే భారత్ ఇంత స్కోరు సాధించడానికి జెమీమా రోడ్రిగ్స్ (44*) ప్రధాన కారణం. ఓవైపు వికెట్లు పడినా ఆఖరి వరకు క్రీజ్‌లో ఉండి దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కెంప్‌ 2.. స్కివెర్‌, బ్రంట్ చెరో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని