టీమ్ఇండియా బోణీ కొట్టింది..
ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 150/7కే పరిమితమైంది....
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై విజయం
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 150/7కే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించి.. పొట్టి సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. చాహల్ 3/25, నటరాజన్ 3/30 విజృంభించడంతో కంగారూలు చేతులెత్తేశారు.
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆర్కీ షార్ట్ (34; 38 బంతుల్లో 3x4), ఆరోన్ ఫించ్ (35; 26 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేసి తొలి వికెట్కు 56 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న ఫించ్ను, వన్డౌన్ బ్యాట్స్మెన్ స్టీవ్స్మిత్ (12)ను చాహల్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు పంపాడు. 8వ ఓవర్లో ఫించ్ హార్దిక్ చేతికి, 10వ ఓవర్లో స్మిత్.. సంజూ చేతికి చిక్కారు. ఇక తర్వాతి ఓవర్లోనే మాక్స్వెల్ (2) నటరాజన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో భారత్ మ్యాచ్పై పట్టు సాధించింది. ఈ క్రమంలో షార్ట్, హెన్రిక్స్ (30; 20 బంతుల్లో 1x4, 1x6) మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 38 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్ విడగొట్టాడు. 15వ ఓవర్లో షార్ట్ను ఔట్ చేసి భారత్కు ఊపిరిపోశాడు. ఆపై మాథ్యూవేడ్ (7), హెన్రిక్స్, మిచెల్ స్టార్క్(1) వరుసగా ఔటయ్యారు. చివరికి అబాట్ (12), స్వెప్సన్ (12) ధాటిగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
జడేజా మెరుపు బ్యాటింగ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) అర్ధశతకానికి తోడు రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా ముందు పోరాడే స్కోర్ నిర్దేశించింది. ఆదిలోనే శిఖర్ ధావన్ (1) ఔటైనా వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9)తో కలిసి రాహుల్ వేగంగా పరుగులు సాధించాడు. దీంతో పవర్ప్లేలో భారత్ ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. అనంతరం టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సంజూ శాంసన్ (23), మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆపై బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్య (16; 15 బంతుల్లో, 1×6), జడేజా ఆదుకునే ప్రయత్నం చేసినా ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. పాండ్య ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. జడేజా మెరుపు బ్యాటింగ్ చేయడంతో చివరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్ 7 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు తీయగా స్పెప్సన్, జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.