Shane Warne: భారత్ అంటే అమితమైన ప్రేమ.. వార్న్ అరంగేట్రం చేసింది కూడా మనపైనే..!
స్పిన్ బౌలింగ్కే వన్నె తెచ్చిన ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్. తన లెగ్స్పిన్తో బంతిని గింగిరాలు తిప్పుతూ ఇలా కూడా బౌలింగ్ చేయొచ్చా అని బ్యాట్స్మెన్ను తికమక పెట్టడం అతడి ప్రత్యేకత...
ఆసీస్ స్పిన్ దిగ్గజం గురించి ఆసక్తికర విషయాలు
స్పిన్ బౌలింగ్కే వన్నె తెచ్చిన ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్. తన లెగ్స్పిన్తో బంతిని గింగిరాలు తిప్పుతూ.. ఇలా కూడా బౌలింగ్ చేయొచ్చా అని బ్యాట్స్మెన్ను తికమక పెట్టడం అతడి ప్రత్యేకత. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 1001 వికెట్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు శుక్రవారం హఠాన్మరణం చెందాడు. క్రికెట్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచి దివికేగాడు. ఈ సందర్భంగా షేన్వార్న్ గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
* అరంగేట్రం: షేన్వార్న్ అరంగేట్రం చేసింది టీమ్ఇండియాపైనే. 1992 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఈ స్పిన్ మాంత్రికుడు తొలిసారి టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే, ఆ మ్యాచ్లో అతడు 45 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ మాత్రమే తీసి 150 పరుగులు సమర్పించుకొని నిరాశపరిచాడు. కానీ, ఆ ఒక్క వికెట్ మాత్రం డబుల్ సెంచరీ సాధించిన రవిశాస్త్రి(206)ది కావడం గమనార్హం. అంటే షేన్వార్న్ తొలి వికెట్ మన మాజీ కోచ్దే.
* 97 కేజీలు: వార్న్ తన అరంగేట్రం టెస్టు నాటికే అధిక బరువుతో ఉన్నాడు. టీమ్ఇండియాతో ఆడిన తొలి టెస్టు సమయంలో అతడి బరువు 97 కేజీలు.
* ముందే పసిగట్టాడు: షేన్వార్న్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత్, ఇంగ్లాండ్కు సంబంధించిన గ్రూప్-బిలోని 11వ మ్యాచ్ ఫలితాన్ని ముందే పసిగట్టాడు. ఆరోజు మ్యాచ్కు ముందే ఫలితం టై అవుతుందని ట్వీట్ చేశాడు. నిజంగానే ఆ మ్యాచ్ టైగా మారింది. భారత్ తొలుత 338 పరుగులకు ఆలౌటవ్వగా ఇంగ్లాండ్ కూడా ఎనిమిది వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.
* సచిన్దే పైచేయి: షేన్వార్న్ ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లపైనా, గొప్ప గొప్ప బ్యాట్స్మెన్పైనా అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. కానీ, టీమ్ఇండియా మీద, ముఖ్యంగా సచిన్ తెందూల్కర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. టీమ్ఇండియాపై అతడి సగటు 47. ఇది ఏ కోణంలోనూ అత్యుత్తమ బౌలింగ్ కాదు.
* తగ్గేదేలే అన్నట్లు: టెస్టు క్రికెట్లో లోయర్ ఆర్డర్లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు షేన్వార్న్. ఈ ఫార్మాట్లో అతడు ఒక్క శతకం కూడా సాధించకుండా 3,154 పరుగులు చేశాడు. అందులో 12 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే స్లిప్లోనూ వార్న్ మంచి ఫీల్డర్ అని చెప్పొచ్చు. అక్కడ అతడి ఖాతాలో 125 క్యాచ్లు ఉన్నాయి.
* పడిలేచిన కెరటం: వార్న్ 2003 వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు డోపింగ్ పరీక్షలో పట్టుబడి ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. నిషేధిత ఉత్ప్రేకం వాడాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అయితే, 2004లో తిరిగొచ్చిన అతడు శ్రీలంకపై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. మూడు టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టాడు. ఇంకో విశేషం ఏంటంటే.. తొలి రెండు టెస్టుల్లోని రెండు ఇన్నింగ్స్ల్లో ఐదేసి వికెట్లు తీశాడు.
* తికమక పెట్టాలని: షేన్వార్న్ ఫేవరెట్ కొటేషన్ ఒకటుంది. ‘స్పిన్ బౌలింగ్తో ప్రత్యేకంగా ఏదీ జరగకపోయినా.. ఏదో జరుగుతుందని బ్యాట్స్మెన్ను తికమక పెట్టడం ఓ కళ’. ఇలాంటి ఫీలింగ్తోనే వార్న్ తన బౌలింగ్తో ఎంతో మందిని బోల్తాకొట్టించాడు.
* భారత్ అంటే అమితమైన ప్రేమ: షేన్వార్న్కు భారత దేశం అంటే అమితమైన ప్రేమ. అవకాశం చిక్కినప్పుడల్లా మన దేశంపై తన అభిమానాన్ని చాటుకుంటాడు. గతేడాది భారత్లో కరోనా రెండో వేవ్ సమయంలో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిన సమయంలో ఆందోళన చెందాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండాలని, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఓ ట్వీట్ ద్వారా అభ్యర్థించాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!