Dhoni - Kohli: ధోనీ... నీ చరిత్రను అభిమానులెప్పుడూ మర్చిపోరు: కోహ్లీ

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీకి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని మహేంద్రసింగ్‌ ధోనీ అందరికీ షాకిచ్చాడు. ఈ విషయంపై కోహ్లీ స్పందిస్తూ ప్రత్యేకంగా...

Updated : 25 Mar 2022 10:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీకి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని మహేంద్రసింగ్‌ ధోనీ అందరికీ షాకిచ్చాడు. ఈ విషయంపై కోహ్లీ స్పందిస్తూ ప్రత్యేకంగా అభినందించాడు. ధోనీ సారథ్యంలోనే విరాట్‌ టీమ్‌ఇండియాలోకి వచ్చాడు. తర్వాత మేటి ఆటగాడిగా రాణించి మహీ నుంచే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ చేపట్టాడు. దీంతో ఇద్దరిమధ్య మంచి అనుబంధం ఉంది. అయితే, తాజాగా ధోనీ సీఎస్కే కెప్టెన్సీ వదులుకోగానే కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యుత్తమ సారథ్య బాధ్యతలు నిర్వర్తించావు. ఎల్లో జెర్సీలో దిగ్గజ కెప్టెన్‌గా కొనసాగావు. నీ చరిత్రను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. నువ్వంటే నాకెప్పుడూ అమితమైన గౌరవమే’ అని కోహ్లీ భావోద్వేగ పోస్టుతో సహా ధోనీని హత్తుకునే ఓ ఫొటో పంచుకున్నాడు.

కాగా, ఈ ఏడాది విరాట్‌ సైతం రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆర్సీబీ ఫా డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించింది. దీంతో 2013 తర్వాత ధోనీ, కోహ్లీ తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్లుగా కాకుండా ఆటగాళ్లుగా ఆడుతున్నారు. మరోవైపు ధోనీ సీఎస్కే సారథిగా తప్పుకోవడంపై ఆ జట్టు ఆటగాడు డ్వేన్‌ బ్రావో, మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా సైతం సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని