Team India: వారు భారత జట్టులోకి రావాలంటే.. ఐపీఎల్లో రాణిస్తేనే సరిపోదు!
జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేననే బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్లను కోల్పోవడంపై చర్చ నడుస్తున్న వేళ.. బీసీసీఐ ఆగ్రహానికి గల కారణాలు ఒక్కోటి వెల్లడవుతూ ఉన్నాయి. వారిద్దరి స్వయంకృతం వల్లే కాంట్రాక్ట్ను చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో రాణిస్తే చాలు బీసీసీఐ దృష్టిలో పడొచ్చని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, ఐపీఎల్లో ఎలా ఆడినా.. జాతీయ జట్టులోకి రావాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్ కూడా ఆడాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
‘‘ఇషాన్ బ్రేక్ తీసుకున్న సమయంలో ఎన్సీఏ లేదా రాష్ట్ర జట్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అందుకే, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు. శ్రేయస్ విషయంలోనూ ఇదే సమస్య తలెత్తింది. అయితే, ఇప్పటికీ వీరిద్దరికి జాతీయ జట్టులోకి తలుపులు తెరిచే ఉన్నాయి. దేశవాళీలో ఆడితేనే అవకాశం ఉంటుంది’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
వన్డే వరల్డ్ కప్ కోసమే శ్రేయస్ గత ఐపీఎల్ ఆడలేదా?
వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ మధ్యలోనే బయటకొచ్చేసిన శ్రేయస్.. ఇప్పుడు ఫిట్నెస్ను సాకుగా చూపి రంజీల్లో ఆడకపోవడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే, సెంట్రల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. తాజాగా రంజీ ట్రోఫీ సెమీస్లో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి గురించి కీలక విషయాలు బయటకొస్తున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ కోసం గత ఐపీఎల్కు శ్రేయస్ దూరంగా ఉండిపోయాడని సమాచారం. అతడి స్థానంలో నితీశ్ రాణా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘గతేడాది శస్త్రచికిత్స అనంతరం నొప్పి నివారణ మాత్రలను వాడాడు. వరల్డ్ కప్ సమయంలోనూ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీస్, ఫైనల్లోనూ మళ్లీ గాయం తిరగబెట్టింది. అయినా మొత్తం టోర్నీ ఆడాడు. దాని కోసం గత ఐపీఎల్ సీజన్లోనూ ఆడలేదు. ఇక వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆసీస్తో టీ20 సిరీస్ ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ వెళ్లాడు. జనవరిలో రంజీ మ్యాచ్లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనూ పాల్గొన్నాడు. ఇలా వరుసగా మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు ఎవరూ లేరు. అయినా, అతడిపై వేటు పడటం ఆశ్చర్యంగా ఉంది’’ అని కోల్కతా నైట్రైడర్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా