Sehwag : అది ‘నో బాల్’ మాత్రమే కాదు.. ఎన్నో లక్ష్యాలకు ‘ఎండ్ బాల్’!
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్లో...
భారత మహిళల జట్టు ఓటమికి కారణమైన నోబాల్పై సెహ్వాగ్ పోస్ట్
ఇంటర్నెట్ డెస్క్: ఒక్క ‘నో బాల్’.. మ్యాచ్ ఫలితంతోపాటు ఎంతోమంది క్రికెటర్ల కలలను కూల్చేస్తుందని టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ను షేర్ చేశాడు. ‘‘అది కేవలం నోబాల్ మాత్రమే కాదు. భారత మహిళల జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అంగుళం వల్ల ఎన్నో సంవత్సరాలపాటు పడిన శ్రమ వృథా అయిపోతుంది. చాలా మంది క్రికెటర్లకు జీవిత లక్ష్యాలను దూరం చేస్తుంది’’ అని పోస్ట్ పెట్టాడు.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మ్యాచ్ ఫలితంపైనే టీమ్ఇండియా భవితవ్యం ఆధారపడిన సందర్భంలో అది జరగడం క్రికెట్ అభిమానులను బాధపెట్టింది. కప్ పోరులో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 274/7 స్కోరు చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. అయితే ప్రొటీస్ బ్యాటర్లు వాల్వార్డట్ (80), గుడ్డాల్(49), డుప్రీజ్ (52*) రాణించడంతో ఒకానొక దశలో ఆ జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ వెళ్లింది. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి ఏడు పరుగులు కావాల్సి ఉంది. టీమ్ఇండియా బౌలర్ దీప్తి శర్మ నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేయడంతో కేవలం నాలుగు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులకు మూడు పరుగులు కావాల్సిన సమయంలో.. అప్పటికే క్రీజ్లో కుదురుకున్న డుప్రీజ్ భారీ షాట్కు యత్నించి బౌండరీ లైన్ వద్ద హర్మన్ చేతికి చిక్కింది. అయితే అది ‘నో బాల్’గా తేలడంతో భారత్ ఆశలకు తెరపడినట్లైంది. చివరి రెండు బంతులకు రెండు సింగిల్స్ తీసి దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒకవేళ అది నోబాల్ కాకుండా ఉంటే భారత్నే విజయం వరించేది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్